Phone Tapping Case: కేసీఆర్ అరెస్ట్ తప్పదా..?

రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో కేసీఆర్ ప్రధాన సూత్రధారిగా వ్యవహరించాడని కాంగ్రెస్, బీజేపీ భావిస్తుంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ అరెస్ట్ తప్పదని కొందరు భావిస్తున్నారు. తాజాగా బీజేపీ కేసీఆర్ అరెస్టును తప్పనిసరి చేయాల్సిందేనని తెగేసి చెప్పింది.

Phone Tapping Case: గత రెండు నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హీట్ పుట్టించాయి. అయితే అసెంబ్లీ, లోకసభ ఎన్నికల అనంతరం నేతలు సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారు. ప్రధానంగా సీఎం జగన్ లండన్ వెళ్లగా, చంద్రబాబు యూఎస్ కి వెళ్లిపోయారు. ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో కేసీఆర్ ప్రధాన సూత్రధారిగా వ్యవహరించాడని కాంగ్రెస్, బీజేపీ భావిస్తుంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ అరెస్ట్ తప్పదని కొందరు భావిస్తున్నారు. తాజాగా బీజేపీ కేసీఆర్ అరెస్టును తప్పనిసరి చేయాల్సిందేనని తెగేసి చెప్పింది. (KCR Arrest)

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ పోలీసు అధికారిని అరెస్టు చేయడం సంచలనం రేకెత్తించడంతో ఈ కేసులో కేసీఆర్ ను అరెస్టు చేసి ప్రాసిక్యూషన్ చేయాలని బిజెపి తెలంగాణ విభాగం మంగళవారం డిమాండ్ చేసింది.బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడినట్లు ఆధారాలు ఉన్నప్పటికీ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎందుకు అరెస్టు చేయడం లేదని బీజేపీ అధికార ప్రతినిధి ఎన్‌వీ సుభాష్‌ ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్‌ను బీఆర్‌ఎస్‌లో అతిపెద్ద కుంభకోణంగా అభివర్ణించిన ఆయన.. కేసీఆర్ కుటుంబం, వారికి సన్నిహితంగా ఉండే పోలీసు అధికారుల ప్రమేయం ఉందని ఆరోపించారు.ఈ కేసులో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కుమ్మక్కయ్యాయని అన్నారు.

బీఆర్‌ఎస్ ప్రభుత్వం పలువురు బీజేపీ నేతలను వేధించిందని పోలీసు అధికారుల మాటల్లోనే తెలియజేస్తోందని అన్నారు. సీబీఐ విచారణ ద్వారా నిజానిజాలు బయటకు వస్తాయని ఆయన అన్నారు. కాగా కేసీఆర్‌ చర్యలు ప్రజాస్వామ్యానికి అవమానకరమని బీజేపీ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. బీఆర్‌ఎస్ పాలనలో ఫోన్ ట్యాపింగ్ ఎమర్జెన్సీ కంటే ఘోరంగా ఉంది. ఇది రాజ్యాంగ, మానవ హక్కుల ఉల్లంఘన అని ఆయన అన్నారు.బీజేపీ పట్ల కేసీఆర్‌కు ఉన్న భయం ఇప్పుడు బయట పడిందని చెప్పారు. ఈ కేసులో నిందితుడైన మాజీ డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ రాధా కిషన్ రావు చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు.

ప్రతిపక్ష పార్టీల నాయకులు, వ్యాపారవేత్తలు, బీఆర్‌ఎస్‌లోని అసమ్మతివాదుల ఫోన్‌లను ట్యాప్ చేయడానికి కేసీఆర్ నేతృత్వంలోని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్‌ఐబి)ని ఎలా ఉపయోగించిందనే వివరాలను మాజీ డీసీపీ వెల్లడించారు. కేసీఆర్ ప్రమేయంపై గతంలో తాను చేసిన వాటిని రాధా కిషన్ రావు ఒప్పుకున్నారని బండి సంజయ్ అన్నారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వ్యక్తిగా కేసీఆర్ చట్టానికి ద్రోహం చేయడమే కాకుండా పౌరుల ప్రాథమిక హక్కులను కాలరాశారని మండిపడ్డారు. కేసీఆర్ బిఆర్‌ఎస్ చీఫ్ ఎమ్మెల్యే పదవితో సహా రాజ్యాంగబద్ధమైన ఏ పదవిని చేపట్టడానికి అనర్హుడని, ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాల్సిన అవసరం ఉందని బండి పేర్కొన్నారు.

కేసీఆర్‌తో పాటు బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడిన వారందరిపైనా విచారణ జరిపి ప్రజాప్రతినిధులను పదవుల నుంచి తొలగించాలన్నారు. బీఆర్ఎస్ సభ్యత్వాన్ని నిషేధించడం గురించి కూడా ఆలోచించడం అత్యవసరమని బండి అభిప్రాయపడ్డారు. స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్‌ను ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు.

Also Read: CM Jagan Stone Attack: సీఎం జగన్ పై దాడి కేసులో కీలక పరిణామం