Palvai Sravanthi: మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి ఫిక్స్!

మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికకు సంబంధించి తెలంగాణ కాంగ్రెస్ తీవ్ర కసరత్తులు చేస్తోంది.

  • Written By:
  • Updated On - September 9, 2022 / 02:55 PM IST

మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికకు సంబంధించి తెలంగాణ కాంగ్రెస్ తీవ్ర కసరత్తులు చేస్తోంది. మునుగోడు కాంగ్రెస్ బరిలో కీలక నేతలు తెరపైకి వచ్చాయి. ఉప ఎన్నికకు కాంగ్రెస్‌ టికెట్‌ కోసం స్రవంతితో పాటు స్థానిక నేతలు చల్లమల్ల కృష్ణారెడ్డి, పల్లె రవికుమార్‌, కైలాష్‌ లు టికెట్‌ను ఆశించారు. అందులో ఇద్దరు పేర్లను తెలంగాణ కాంగ్రెస్ హైకమాండ్ కు పంపింది. అయితే ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సీనియర్ నేత పాల్వాయి స్రవంతిని అధిష్టానం ఖరారు చేసింది.

గతంలో గాంధీభవన్‌లో రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జి మాణికం ఠాగూర్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి సీనియర్ నేతలంతా హాజరై కాంగ్రెస్ అభ్యర్థిగా స్రవంతిని పోటీకి దింపాలని సమిష్టి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని అభ్యర్థిగా బరిలోకి దింపాలని బిజెపి ఇప్పటికే సూచించగా, అధికార టిఆర్ఎస్ అభ్యర్థి కోసం కష్టపడుతోంది. మునుగోడు ఉప ఎన్నికలో గెలుపు గుర్రం స్రవంతి పోటీలో ఉంటే కాంగ్రెస్ గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉంటాయని సర్వే స్పష్టంగా సూచించడంతో ఉపఎన్నికల్లో మహిళా అభ్యర్థిని నిలబెట్టేందుకు ఆ పార్టీ నేతలు మొగ్గు చూపినట్టు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.