Owaisi Asks Modi: ప్రధాని సాబ్.. చైనా ఏంచేస్తోందో మీకు తెలుసా!

డ్రాగన్ కంట్రీ చైనా ఇండియాపై విషం చిమ్ముతోంది. గుట్టుచప్పుడు కాకుండా ఇండియన్ ఆర్మీ, భారత్ స్థావారాలపై రహస్య ఆపరేషన్

  • Written By:
  • Updated On - August 27, 2022 / 04:11 PM IST

డ్రాగన్ కంట్రీ చైనా ఇండియాపై విషం చిమ్ముతోంది. గుట్టుచప్పుడు కాకుండా ఇండియన్ ఆర్మీ, భారత్ స్థావారాలపై రహస్య ఆపరేషన్ చేస్తుందనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ సరిహద్దు ప్రాంతాల్లో హద్దు మీరి ప్రవర్తిస్తోంది. ఇప్పటికే అరుణచల్ ప్రదేశ్ పై భారత ప్రముఖులు పర్యటించడాన్ని తప్పుపడుతోంది. ఈ నేపథ్యంలో అరుణ్ చల్ ప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో చైనా ఆర్మీ నిషేధిత నిర్మాణాలు చేపడుతోంది.

వీటిని వ్యతిరేకిస్తూ స్థానికులు, ఎంఐఎం నాయకులు ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దేశ భద్రతను ప్రశ్నిస్తూ ప్రధాని నరేంద్ర మోడీని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ట్విట్లర్లో ప్రధాన మంత్రి మోడీపై విరుచుకుపడ్డారు. ’’చైనా పేరు చెప్పడానికి కూడా భయపడే మన ప్రధాని సాహెబ్.. అరుణాచల్ ప్రదేశ్‌లోని మన భూభాగంలో ఈ చైనా నిర్మాణ పార్టీ ఏమి చేస్తుందో మాకు చెబుతారా? గతంలో లడఖ్ లో చైనా దురంహకారం ప్రదర్శించింది. ఆ సమయంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించారు’’ అని ఓవైసీ ట్వీట్ చేయడం ఆసక్తిని రేపుతోంది.