Site icon HashtagU Telugu

Medaram Jatara 2024 : ఫిబ్రవరిలోనే మేడారం జాతర.. అభివృద్ధి పనుల ఊసేది ?

Medaram

Medaram

Medaram Jatara 2024 : రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే మేడారం మహా జాతరకు ఇంకా రెండున్నర నెలల టైమే మిగిలింది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో నిర్వహించే సమ్మక్క, సారలమ్మ జాతర ఈసారి ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు(Medaram Jatara 2024) జరగబోతోంది. ప్రతిసారి జాతరకు కనీసం 100 రోజుల ముందే అభివృద్ధి పనులు, ఏర్పాట్లను ప్రారంభిస్తారు. కానీ ఈసారి ఇంకా పనులు మొదలుకాలేదు. రూ.75 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు మొత్తం 21 శాఖలు ప్రతిపాదనలను జులైలోనే గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి  పంపించాయి.  అయితే వాటికి ఇంకా మోక్షం లభించలేదు. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రతిపాదనలను పరిశీలించి ఆమోదం తెలపగానే పనులు మొదలయ్యే అవకాశం ఉంది.  మేడారం జాతర కోసం రహదారులు, స్నానఘట్టాలు, కల్యాణ కట్టలు, చెక్‌డ్యాంలు, మరుగుదొడ్లు, నీటి ట్యాంకులు, క్యూలైన్లు, హోల్డింగ్‌ పాయింట్లు, సీసీ కెమెరాలు, ట్రాఫిక్‌ సిగ్నల్స్‌, డంప్‌యార్డుల వంటివి నిర్మిస్తుంటారు.

We’re now on WhatsApp. Click to Join.

అస్తవ్యస్తంగా జాతర ప్రాంగణం 

Also Read: Old Cars – MLAs : ఎమ్మెల్యేలు, మంత్రులకు పాత కార్లే.. కొత్తవి కొనేది లేదు : సీఎం