TBJP MPs: మోడీ కేబినెట్‌లోకి తెలంగాణ ఎంపీ!

బీజేపీ హైకమాండ్ తెలంగాణను సీరియస్‌గా తీసుకుంది.

Published By: HashtagU Telugu Desk
Bjp Mps

Bjp Mps

బీజేపీ హైకమాండ్ తెలంగాణను సీరియస్‌గా తీసుకుంది. చరిత్రలో తొలిసారిగా అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని పసిగట్టిన ఆ పార్టీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. 2023 ఎన్నికల్లో విజయం సాధించేందుకు రాష్ట్రంలోని బీసీ జనాభాను తమవైపు తిప్పుకోవాలని ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. దీంతో తెలంగాణకు మరో కేంద్ర కేబినెట్‌ బెర్త్‌ ఇవ్వాలని ఆ పార్టీ యోచిస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించాలని చూస్తున్నారు.

తెలంగాణకు ఇందులో మరో బెర్త్ లభిస్తుంది. తెలంగాణలో ప్రస్తుతం బీజేపీకి ఐదుగురు ఎంపీలు ఉన్నారు. కేబినెట్‌లో కిషన్‌రెడ్డి ఒక్కరే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీసీ ఎంపీల్లో బండి సంజయ్, ధర్మపురి అరవింద్, లక్ష్మణ్ ముందంజలో ఉన్నారు. మరి చివరకు ఎవరికి అదృష్టం వరిస్తారో చూడాలి. 2018లో బీజేపీతో టీడీపీ తెగతెంపులు చేసుకున్న తర్వాత పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేకపోవడం విశేషం.

  Last Updated: 06 Sep 2022, 03:12 PM IST