Tollywood Politics: చిరు, మోహన్ బాబులకు షాక్.. ఎన్టీఆర్ వేడుకలకు నో ఇన్విటేషన్?

ఎన్టీఆర్ శత ఉత్సవాలకు మెగాస్టార్ చిరంజీవి, డైలాగ్ కింగ్ మోహన్‌బాబులకు ఆహ్వానం అందకపోవడం చర్చనీయాంశమవుతోంది.

  • Written By:
  • Updated On - May 19, 2023 / 02:06 PM IST

ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ఈ నెల 20న హైదరాబాద్‌లో జరగాల్సి ఉంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులను ఆహ్వానించారు నిర్వాహకులు. అయితే మెగాస్టార్ చిరంజీవి, డైలాగ్ కింగ్ మోహన్‌బాబు లాంటి ప్రముఖులకు ఆహ్వానం అందకపోవడం చర్చనీయాంశమవుతోంది. అయితే ఏపీలో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ ను ఆహ్వానించకపోవడంతో చంద్రబాబుపై విమర్శలకు తావిచ్చింది. కమిటీ చైర్మన్ టీడీ జనార్దన్ వివరాల ప్రకారం.. శతజయంతి వేడుకలకు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులను ఆహ్వానించారు.

ఆహ్వానితుల్లో పవన్ కళ్యాణ్, విక్టరీ వెంకటేష్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, సుమన్, మురళీమోహన్, నందమూరి కళ్యాణ్ రామ్, మాజీ ఎంపీ జయప్రద, కె రాఘవేంద్రరావు, అశ్విని దత్, ఆదిశేషగిరిరావు తదితరులు ఉన్నారు. ప్రభాస్, అల్లు అర్జున్‌లను కూడా ఆహ్వానించడం కూడా హాట్ టాపిక్ గా మారింది. అయితే వారి ఆహ్వానాల వెనుక అంతర్లీన రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయి. ప్రభాస్‌ను ఆహ్వానించడం అతని అభిమానుల మద్దతును ఆకర్షించడానికి చేసిన ఒక ప్రయత్నం. ఇక పవన్ కళ్యాణ్ విషయానికొస్తే, చంద్రబాబు ఇప్పటికే ఆయనతో పొత్తుపెట్టుకున్నారు, అందుకే ఆయనను ఆహ్వానించినట్టు తెలుస్తోంది.

ఇటీవలి కాలంలో వైసీపీ ప్రభుత్వంపై అశ్వినీదత్ బాహాటంగానే విమర్శలు గుప్పించగా, సీనియర్ హీరో సుమన్ మాత్రం చంద్రబాబుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ను ఇప్పటికే ఆహ్వానించారు. అయితే వ్యక్తిగత పనుల కారణంగా జూనియర్ ఎన్టీఆర్ హాజరుకాకపోవచ్చునని తెలుస్తోంది. విచిత్రమేమిటంటే, దివంగత ఎన్టీఆర్‌తో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్న మంచు మోహన్‌బాబుని ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. అతను ఆహ్వానిస్తే నిజం మాట్లాడతాడనే భయం నిర్వాహకుల్లో ఉంది. అభిమానుల్లో విపరీతమైన పాపులారిటీ ఉన్న మెగాస్టార్ చిరంజీవి కి కూడా ఇన్విటేషన్ అందకపోవడం అనేక పుకార్లకు దారితీస్తోంది.

Also Read: Viveka murder case: సీబీఐ విచారణ వేళ అవినాశ్ రెడ్డి బిగ్ ట్విస్ట్.. ఏం జరిగిందంటే!