బంగారు తెలంగాణ వ్యాప్తంగా బాలికలకు మరుగుదొడ్లులేని స్కూల్స్ 20శాతం పైగా ఉన్నాయని యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ (UDISE) తేల్చింది. భారత దేశ వ్యాప్తంగా 78854 పాఠశాలల్లో బాలికలకు మరుగుదొడ్లు లేవు. శాతం పరంగా దేశంలోని మొత్తం పాఠశాలల్లో ఇది 5.3 శాతం.
మరుగుదొడ్లు లేకపోవడం బాలికల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది, ఎందుకంటే వారు పాఠశాల సమయాల్లో ఆహారం మరియు త్రాగడానికి దూరంగా ఉంటారు. అంతే కాకుండా మరుగుదొడ్ల సౌకర్యం లేకపోవడంతో బాలికలు బడి మానేస్తున్నారు. రుతుక్రమం సమయంలో, చాలా మంది బాలికలు మరుగుదొడ్డి సౌకర్యం కల్పించకపోతే పాఠశాలకు వెళ్లడం మానేస్తారు.
RTE ఏం చెబుతుంది?
విద్యాహక్కు చట్టం 2009 ప్రకారం, చట్టం అమలులోకి వచ్చిన నాటి నుంచి ఐదేళ్లలోపు పాఠశాలల్లో బాలబాలికలకు వేర్వేరుగా మరుగుదొడ్లు ఉండాలి. అయితే, ఎన్నో ఏళ్లుగా తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల్లోని చాలా పాఠశాలల్లో బాలికలకు మరుగుదొడ్లు లేవు. బడ్జెట్ కేటాయింపులు లేకపోవడమే దీనికి కారణం. తెలంగాణలో విద్యారంగానికి బడ్జెట్ శాతం తగ్గింది. కారణం ఏమైనప్పటికీ బంగారు తెలంగాణలో 20శాతానికి పైగా స్కూల్స్ లో బాలికలకు మరుగుదొడ్లు లేకపోవడం శోచనీయం.