Site icon HashtagU Telugu

Omicron :తెలంగాణలో నో ఓమిక్రాన్

Omicron

Omicron

హైదరాబాద్: తెలంగాణ ప్రజలు రిలాక్స్ అవుతారని తెలంగాణ వైద్యఆరోగ్య శాఖ ప్రకటించింది. విదేశాల నుంచి ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా వారిలో 13 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. అయితే వీరిలో ఎవరికీ ఓమిక్రాన్ లేదని పరిశోధనల్లో తేలింది.

దేశంలో ఓమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే వారిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.
ఇతర దేశాల నుంచి వచ్చే వారికి కరోనా పరీక్షలు నిర్వహించి పాజిటివ్‌గా తేలితే జన్యుపరీక్షకు పంపుతారు. పంపిన 13 పాజిటివ్ కేసుల్లో ఏదీ ఓమిక్రాన్ పాజిటివ్ కాదని అధికారులు తెలిపారు. దీంతో తెలంగాణలో ఒక్క ఓమిక్రాన్ కేసు కూడా నమోదు కాలేదు.

విదేశాల నుంచి వచ్చే వారు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం పేర్కొంది. ఓమిక్రాన్‌ను అరికట్టడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటే దాని వల్ల కలిగే నష్టాన్ని అంచనా వేయడం కూడా కష్టమని ప్రభుత్వ అధికారులు తెలిపారు. ప్రజలు మాస్క్ ధరించాలని, శానిటైజ్ చేయాలని, భౌతిక దూరం పాటించాలని వైద్యులు సూచించారు.

Exit mobile version