Site icon HashtagU Telugu

Khammam: జలగం చేరికతో ఖమ్మం బీజేపీ ఎంపీ సీటు ఆశావహుల్లో పోటీ

Jalgam

Jalgam

Khammam: బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్‌రావు ఇటీవలే బీజేపీలోకి లాంఛనంగా చేరారు. దీంతో బీజేపీలో ఖమ్మం ఎంపీ టికెట్‌ కోసం రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి తరుణ్ చుగ్, రాజ్యసభ ఎంపీ కె. లక్ష్మణ్, పొంగులేటి సుధాకర్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరిన జలగం ఖమ్మం ఎంపీ టికెట్ కోసం పోటీ చేసేందుకు ఆసక్తి చూపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. .

జలగం బీజేపీలోకి రాకముందు ఖమ్మం ఎంపీ టికెట్ కోసం పలువురు పార్టీ సీనియర్ నేతల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, డాక్టర్ జి వెంకటేశ్వర్లు, తాండ్ర వినోద్ రావు వంటి ప్రముఖుల పేర్లు వినిపించాయి. అయితే జలగం చేరికతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది.

2014లో కొత్తగూడెం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన జలగం 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై ఓటమి చవిచూశారు. తాజాగా జరిగిన ఎన్నికల్లోనూ జలగం ఇండిపెండెంట్ గా పోటీ చేసి రెండవ స్థానాన్ని దక్కించుకున్నాడు. గతంలో కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన సీనియర్ నేత శ్రీధర్ రెడ్డి ఇప్పుడు ఖమ్మం ఎంపీ టికెట్ కోసం పోటీ పడుతున్నారు. జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీలో ఆయన చురుకైన పాత్ర పోషించాడు.

ఖమ్మంకి చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు ఎంపీ టికెట్ కోసం పార్టీ పరిశీలనలో ఉన్న మరో అభ్యర్థి. ఖమ్మం జిల్లా రావినూతల గ్రామానికి చెందిన ఈయన విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసి పార్టీ అభివృద్ధికి చురుగ్గా కృషి చేశారు. కాగా కొత్తగూడెం జిల్లా తిమ్మంపేటకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త తాండ్ర వినోద్ రావు కూడా రేసులో నిలిచారు.

జలగం బీజేపీలోకి రావడంతో, ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగల్‌రావుతో ఉన్న కుటుంబ సంబంధాలను దృష్టిలో ఉంచుకుని ఆయనకు ఖమ్మం ఎంపీ సీటు కల్పించవచ్చని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. అయితే జలగం ఆసక్తి కనబరచకపోతే, సీనియర్ నాయకుడు శ్రీధర్ రెడ్డి లేదా బీసీ నాయకుడు డాక్టర్ జివికి టిక్కెట్ ఇవ్వడానికి పార్టీ మొగ్గు చూపుతుందని పార్టీ సీనియర్ నాయకులు చెప్తున్నారు.

Also Read: Telangana : బిఆర్ఎస్ పార్టీ ఖాళీ కాబోతుందా..?

Exit mobile version