Site icon HashtagU Telugu

MP Raghunandan Rao : ఎమ్మెల్సీ కవితకు ఎంపీ రఘుందన్‌ రావు కౌంటర్‌..

Mp Raghunandan Rao, Mlc Kavitha

Mp Raghunandan Rao, Mlc Kavitha

MP Raghunandan Rao : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పసుపు బోర్డు స్థాపనకు తమ పోరాటం వల్లే సాధ్యమైందని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు, కవిత జైల్లో ఉన్నప్పుడు ఆమె ఆరోగ్యం క్షీణించినట్లుగా వార్తలు వచ్చిన నేపథ్యంలో, ఆమె ఇంకా ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ ఉంటుందని వ్యాఖ్యానించారు. అయితే, ఆమెకు మంచి డాక్టర్‌ను చూపించుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుందని సూచించారు. అలాగే, ముందుగా ఆమె ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకుని, తరువాత మీడియాతో మాట్లాడితే మెరుగైనదని ఎంపీ రఘునందన్ రావు అన్నారు.

సంగారెడ్డి జిల్లా బీజేపీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో, ఎంపీ రఘునందన్ రావు, పదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు రైతులు కేటీఆర్‌కు గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ చుట్టూ ఉన్న గ్రామాలలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు కేటీఆర్ ఎందుకు స్పందించలేదని నిలదీశారు. బీఆర్ఎస్ పార్టీకి అధికారం పోయాక మాత్రమే రైతులపై కేటీఆర్‌కు ప్రేమ పెరిగిందా? అని ఆయన ప్రశ్నించారు.

UPI Vs Saifs Attacker : సైఫ్‌పై ఎటాక్.. యూపీఐ పేమెంట్‌తో దొరికిపోయిన దుండగుడు

మరోవైపు, కాంగ్రెస్ పార్టీ హయాంలో అంబేద్కర్‌ను గౌరవించలేదని, కేవలం అంబేద్కర్ జయంతి , వర్ధంతులప్పుడు మాత్రమే గౌరవం చెలాయించారని ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. ఆతర్వాత, 1950లో జవహర్ లాల్ నెహ్రూ రాజ్యాంగాన్ని అవమానించాడని, రెండోసారి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ద్వారా రాజ్యాంగాన్ని తుంగలో తొక్కారని విమర్శించారు. అలాగే, గాంధీ-నెహ్రూ కుటుంబం ఐదు తరాల పాటు రాజ్యాంగాన్ని అవమానించిందని, ఇప్పుడు రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని రక్షించమని రోడ్లపై తిరుగుతున్నారని ఎంపీ ఆక్షేపించారు.

ఎంపీ రఘునందన్ రావు, అధికారంలో లేని సమయంలోనే కాంగ్రెస్ పార్టీకి పేదలు గుర్తుకు వచ్చారని, కానీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం పేదలకు పట్టించుకోకుండా వారి బాధలు, అవసరాలను పట్టించుకోలేదని విమర్శించారు.

Konark : మార్చి నుంచి నైని బ్లాక్ నుంచి బొగ్గు ఉత్పత్తి చేస్తాం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క