ప్రత్యర్థులపై మోత్కుపల్లి వీరవిహారం

బీజేపీ, కాంగ్రెస్ పార్టీ మీద సీనియర్ పొలిటీషన్, టీఆర్ఎస్ తాజా నేత మోత్కుపల్లి ఫైర్ అయ్యాడు. హుజురాబాద్ ఎన్నికల్లో ఏమిజరిగిందో వివరించాడు. సోనియా కుటుంబాన్ని రేవంత్ అమ్మేస్తాడాని విమర్శించాడు. హుజురాబాద్లో ఈటెల కాంగ్రెస్ ను తాకట్టు పెట్టాడని రేవంత్ పై ఆరోపణలు చేసాడు.

  • Written By:
  • Updated On - November 11, 2021 / 02:03 PM IST

బీజేపీ, కాంగ్రెస్ పార్టీ మీద సీనియర్ పొలిటీషన్, టీఆర్ఎస్ తాజా నేత మోత్కుపల్లి ఫైర్ అయ్యాడు. హుజురాబాద్ ఎన్నికల్లో ఏమిజరిగిందో వివరించాడు. సోనియా కుటుంబాన్ని రేవంత్ అమ్మేస్తాడాని విమర్శించాడు. హుజురాబాద్లో ఈటెల కాంగ్రెస్ ను తాకట్టు పెట్టాడని రేవంత్ పై ఆరోపణలు చేసాడు.

మోత్కుపల్లి ప్రెస్ మీట్ లో మరిన్ని అంశాలు.

* హుజురాబాద్ లో ఈటెల గెలుపు కాదు- వాపే.

* కాంగ్రేస్ కలయికతో ఈటెల గెలిచాడు.

* పార్టీనే అమ్ముకున్న వ్యక్తి పిసిసి రేవంత్ రెడ్డి.

* ఇట్లనే వదిలేస్తే సోనియాగాంధీ కుటుంబాన్ని అమ్ముకుంటాడు.

* కాంగ్రేస్ ఓట్లను ఈటెల కొనుక్కుండు.

* ఈటెల గెలుపులో నీతి ఉందా?

* దళితులభూములు- ఆలయ భూములు తన దగ్గర ఉన్నట్లు ఈటెలే చెప్పిండు.

రేవంత్ రెడ్డి నమ్మకద్రోహి- కాంగ్రేస్ పార్టీని మొత్తం బొందపెట్టాడు రేవంత్ రెడ్డి.

బీజేపీ కి వ్యతిరేకంగా డప్పుల దండోరా ఊరూరా వేస్తాం.

* బండి సంజయ్ డప్పు ఇక్కడ కాదు- ఢిల్లీలో కొట్టాలి.

* దళితబంధు దేశం అంతా అమలుఅయ్యే వరకు టీఆరెస్ వెంటాడుతుంది.

* కేసీఆర్ కు దళితులంతా అండగా ఉంటాం.

* బండి సంజయ్ చిల్లగాని లెక్క తయారు అయ్యాడు.

బీజేపీ దేశం అంతటా దళితబంధు అమలు చేయాలి- 15లక్షలు ప్రతి ఖాతాలో వెయ్యాలి.

దళితుల గురించి మాట్లాడే అర్హత బీజేపీ కి లేదు

రాజకీయం కోసం కాదు నేను మాట్లాడేది- నా జాతి రక్షణ కోసం

బీజేపీ పాలసీ పరంగా విమర్శలు చెయ్యాలి- ముందుకు రావాలి.

కేసీఆర్ సహకారం లేకుండా బీజేపీ దేశంలో పాలన చెయ్యలేదు

కేసీఆర్ టచ్ చేయడం అంటే ఏ రకమైన టచ్ చేస్తావో చెప్పరా బండి సంజయ్

దేశంలో రాక్షస పాలన జరుగుతోంది

కేంద్రమంత్రులు పేదలను తొక్కి సంపుతున్నారు

దేశాన్ని బండి సంజయ్ ఒక్కడే కాపడినట్లు పోజు కొడుతున్నావ్