Train Haltings : ఏపీ, తెలంగాణలో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు కొత్త స్టాప్‌లు ఇవే..

Train Haltings : తెలుగు రాష్ట్రాల రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.

  • Written By:
  • Publish Date - March 9, 2024 / 08:39 AM IST

Train Haltings : తెలుగు రాష్ట్రాల రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్. సుదూర ప్రాంతాలకు వెళ్లే పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మరో నాలుగు రైల్వే స్టేషన్లలో ఆపాలని రైల్వే శాఖ నిర్ణయించింది.  తెలంగాణలోనూ పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు 14 స్టేషన్లలో అదనపు స్టాపేజీని రైల్వేశాఖ కల్పించింది. సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, గుంటూరు రైల్వే డివిజన్ల పరిధిలో నడిచే రైళ్లకు తెలంగాణలోని 14 స్టేషన్లలో అదనపు స్టాప్‌లను కేటాయించారు. వీటిలో అత్యధికంగా 9 స్టేషన్లు సికింద్రాబాద్‌ డివిజన్‌ పరిధిలోనివే కావడం గమనార్హం. ప్రధానంగా తిరుపతి-ఆదిలాబాద్‌ కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ (17405/17406) మేడ్చల్‌లో.. నర్సాపూర్‌-నాగర్‌సోల్‌ ఎక్స్‌ప్రెస్‌ (12787, 12788) ట్రైన్  మహబూబాబాద్‌లో ఇకపై ఆగుతాయి. తనతో పాటూ స్థానికుల రిక్వెస్ట్ మేరకు రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు వివరాలతో ఆయన శుక్రవారం ట్వీట్ చేశారు.

We’re now on WhatsApp. Click to Join

  • సికింద్రాబాద్‌-తిరుపతి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ (20701/20702) మిర్యాలగూడలో(Train Haltings) ఆగుతుంది.
  • రేపల్లె-సికింద్రాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ (17646) రామన్నపేటలో ఆగుతుంది.
  • గుంటూరు-సికింద్రాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ (17253) ఉందానగర్‌లో ఆగుతుంది.
  • తిరుపతి-సికింద్రాబాద్‌ పద్మావతి ఎక్స్‌ప్రెస్‌ (12763) నెక్కొండలో ఆగుతుంది.
  • పుణె-కాజీపేట ఎక్స్‌ప్రెస్‌ (22151/22152) మంచిర్యాలలో ఆగుతుంది.
  • దౌండ్‌-నిజామాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ (11409/11410) నవీపేటలో ఆగుతుంది.
  • కాజీపేట-బల్లార్ష ఎక్స్‌ప్రెస్‌ (17035/172036) రాఘవాపురంలో ఆగుతుంది.
  • బల్లార్ష-కాజీపేట ఎక్స్‌ప్రెస్‌ (17035/172036) మందమర్రిలో ఆగుతుంది.
  • సికింద్రాబాద్‌-భద్రాచలం రోడ్‌ కాకతీయ ఎక్స్‌ప్రెస్‌ (17659/17660) తడికలపూడిలో ఆగుతుంది.
  • భద్రాచలం రోడ్‌-సికింద్రాబాద్‌ కాకతీయ ఎక్స్‌ప్రెస్‌ (17660) బేతంపూడి స్టేషన్‌లో ఆగుతుంది.
  • భద్రాచలంరోడ్‌-బల్లార్ష సింగరేణి మెము ఎక్స్‌ప్రెస్‌ (17033,17034) బేతంపూడిలో ఆగుతుంది.
  • కాజీపేట-బల్లార్ష ఎక్స్‌ప్రెస్‌ (17035) రేచ్ని రోడ్‌లో ఆగుతుంది.

Also Read : Seetharam Naik : బీజేపీలోకి మరో బీఆర్ఎస్ మాజీ ఎంపీ ? ఆ స్థానంలో బలమైన అభ్యర్థి

ప్రయాణికుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని మరిన్ని రైళ్లను అందుబాటులోకి తీసుకుని రాబోతోంది రైల్వే మంత్రిత్వ శాఖ. ఈక్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌కు మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను మంజూరు చేసింది. అంతర్రాష్ట్ర ఎక్స్‌ప్రెస్ సర్వీస్ ఇది. పొరుగునే ఉన్న ఒడిశా రాజధాని భువనేశ్వర్ నుంచి విశాఖపట్నం మార్గంలో రాకపోకలు సాగించనుంది. భువనేశ్వర్‌లో బయలుదేరే ఈ రైలు.. పూరి, కటక్, బ్రహ్మపూర్ మీదుగా విశాఖపట్నానికి రాకపోకలు సాగిస్తుంది. ఈ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 12వ తేదీన పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ రూపంలో ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలుస్తోంది. ఏదిఏమైనప్పటికీ ఉత్తరాంధ్ర ప్రాంతానికి మరో వందేభారత్ అందుబాటులోకి రావడం శుభ పరిణామమే.

Also Read :Tandoori Egg Recipe: తందూరి కోడిగుడ్డు రెసిపీ.. ఇంట్లోనే సింపుల్గా చేసుకోండిలా?