యూరప్ దేశాల్లో భయభ్రాంతులకు గురిచేస్తున్న మంకీపాక్స్ ఇప్పుడు భారత్ కు కూడా పాకింది. ఇప్పటికే దేశంలో నాలుగు పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తాజాగా తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలోనూ మంకీపాక్స్ కలకలం రేపుతోంది. ఇంద్రానగర్ కాలనీకిచెందిన ఓ వ్యక్తికి మంకీపాక్స్ సోకినట్లు అనుమానిస్తున్నారు. ఆ వ్యక్తి ఈనెల 6న కువైట్ నుంచి కామారెడ్డికి వచ్చినట్లు గుర్తించారు. మంకీపాక్స్ అనుమానిత లక్షణాలు ఉండటంతో అతడ్ని వైద్యులు ఈనెల 20 నుంచి అబ్జర్వేషన్లో ఉంచారు. తాజాగా అతడిని కామారెడ్డి ఏరియా ఆసుపత్రి నుంచి హైదరాబాద్ తరలించారు.