Rain Alert : ఈరోజు, రేపు తెలంగాణలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో పలుచోట్ల మంగళవారం వరకు వర్షాలు కొనసాగే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ఈ మేరకు వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ను జారీ చేసింది.
ఏపీలోని కొన్ని జిల్లాల్లో ఈ నెల 27 వరకు వానలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (IMD) అంచనా వేస్తోంది. ఇవాళ అనకాపల్లి, తూర్పుగోదావరి, కాకినాడ, పల్నాడు, పార్వతీపురం మన్యం, ప్రకాశం, విజయనగరం, యానాం, అన్నమయ్య, నంద్యాల, శ్రీ సత్యసాయి జిల్లా, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. మిగిలిన జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వచ్చే 5 రోజులూ తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మేఘావృతమై ఉంటుందని వెల్లడించింది. 26, 27 తేదీల్లో కూడా దేశవ్యాప్తంగా వానలు కురిసే (Rain Alert) ఛాన్స్ ఉందని IMD అంటోంది.