MLC Kavitha: పేదింటి పెద్దన్న సీఎం కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని సబ్బండ వర్ణాలకు పెద్దన్నలా నిలుస్తున్న

Published By: HashtagU Telugu Desk
Kavitha

Kavitha

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని సబ్బండ వర్ణాలకు పెద్దన్నలా నిలుస్తున్న విషయం మరోసారి రుజువైందన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. రాష్ట్రంలో కొత్తగా 10 లక్షల మందికి ఆగష్టు 15 నుండి పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయించడం, లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నింపుతుందన్నారు. తాజా నిర్ణయంతో 45 లక్షల మందికి పైగా లబ్దిదారులకు పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా 4 లక్షల మహిళా బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణగా ఎమ్మెల్సీ కవిత గుర్తుచేశారు.

  Last Updated: 15 Aug 2022, 05:37 PM IST