క్యాసినో కింగ్ చిక్కోటి ప్రవీణ్ కాల్ డేటాలోని 20 మంది సెలబ్రిటీలు, 12 మంది ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఎవరు? వాళ్లకు ఈడీ నోటీసులు ఇచ్చినప్పటీకీ పేర్లు మాత్రం బయటకు రావడంలేదు. దూకుడుగా విచారణ చేస్తోన్న ఈడీ సోమవారం నుంచి నోటీసులు అందుకున్న ప్రజాప్రతినిధులను విచారించడానికి సిద్ధం అవుతోంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని కొందరు ప్రజాప్రతినిధులు చిక్కోటితో సంబంధాలు నెరిపారు. ఆ విషయాన్ని కాల్ డేటా, వాట్సప్ మెసేజ్ ల ద్వారా ఈడీ తెలుసుకుంది. ఆ మేరకు నోటీసులు జారీ చేయడం సంచలనం కలిగిస్తోంది.
నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేల జాబితాలో తెలంగాణ ప్రభుత్వంలోని కీలక నేత బ్రదర్ ఉన్నాడని తెలుస్తోంది. అలాగే, హైదరాబాద్ కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, ఉమ్మడి నిజామాబాద్ కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారని తెలుస్తోంది. హైదరాబాద్ జిల్లా నుంచి తొలిసారిగా ఎమ్మెల్యే గా ఎన్నికైన లీడర్ నోటీసులు అందుకున్నారని ప్రచారం జరుగుతోంది. మెదక్ జిల్లాకు చెందిన డీసీసీబీ చైర్మన్, ఉమ్మడి వరంగల్ కు చెందిన ఒక ఎమ్మెల్యే కూడా చిక్కోటితో టచ్ లో ఉన్నట్టు ఈడీ గుర్తించి నోటీసులు జారీ చేసిందని తెలుస్తోంది. వీళ్లే కాకుండా వీఐపీలు కొందరికి కూడా నోటీసులు జారీ చేసినట్టు ప్రచారం జరుగుతోంది.
ఇప్పటి వరకు 12 మంది ప్రజాప్రతినిధులకు ఈడీ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా 20 మంది వీఐపీలకు కూడా నోటీసులు ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. వాళ్లను వరుసగా సోమవారం ఈడీ విచారించనుంది. దీంతో ఇప్పటి వరకు వాళ్ల పేర్లు బయటకు రానప్పటకీ సోమవారం నుంచి బట్టబయలు కానున్నాయి. మొత్తం మీద క్యాసినో కింగ్ చిక్కోటితో సంబంధాలున్న ప్రజాప్రతినిధులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే చిక్కోటి కాల్ డేటా, వాట్సప్ డేటాను రికవరీ చేసిన ఈడీ అందరి జాతాకాన్ని అధ్యయనం చేసింది. మనీల్యాండరింగ్ కు పాల్పడిన వీఐపీలు, ప్రజాప్రతినిధులపై ఈడీ చర్యలు తీసుకోనుంది.