Krishna River Water : కృష్ణా జలాల విషయంలో మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు

Krishna River Water : కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరగొద్దని, రాష్ట్రానికి మెజారిటీ వాటా కలగాలని ఆయన స్పష్టం చేశారు

Published By: HashtagU Telugu Desk
Krishna River Water

Krishna River Water

కృష్ణా నది జలాలు (Krishna River Waters) వివాదస్పదంగా మారుతున్న నేపధ్యంలో, తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar) కీలక వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరగొద్దని, రాష్ట్రానికి మెజారిటీ వాటా కలగాలని ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు, కృష్ణా నది జలాల పట్ల ఉన్న వివాదం ఇంకా కొనసాగుతుండగా, మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Director Shankar : వాట్.. గేమ్ ఛేంజర్ సినిమా నిడివి 5 గంటలా? శంకర్ కామెంట్స్ వైరల్..

రేపు కృష్ణా జలాల వివాదంపై ట్రిబ్యునల్ ముందు విచారణ జరగనుండగా, మంత్రి ఉత్తమ్ ఢిల్లీలో అధికారులతో సమావేశమై, రాష్ట్ర తరఫున సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో రాష్ట్రానికి కృష్ణా జలాల మీద మరింత హక్కు ఉండాలని, దీనిపై బలమైన వాదనలు ట్రిబ్యునల్ ముందు వినిపిస్తామన్నారు. తమ రాష్ట్రంలో సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉండడంతో, తెలంగాణకు అధిక వాటా దక్కాలనే అభిప్రాయం మంత్రి ఉత్తమ్ వ్యక్తం చేశారు. ఈ అంశం ఇప్పటికే గడిచిన ప్రభుత్వంలో చర్చకు వచ్చింది. కానీ ప్రస్తుతం ఆ ప్రతిపాదనను తెలంగాణ ప్రభుత్వం అంగీకరించేది లేదని ఆయన స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఒప్పుకున్న ప్రతిపాదనలను తిరస్కరించిన తెలంగాణ ప్రభుత్వం, ఇప్పుడు కృష్ణా జలాల వాటాను అధికంగా కోర్‌గా తీసుకోవాలని కోరుకుంటుంది. దీనికి సంబంధించి వారు రాజీలు, పరిష్కార మార్గాలను కూడా అన్వేషిస్తున్నారు.

  Last Updated: 15 Jan 2025, 11:53 AM IST