Duddilla Sridhar Babu : కరీంనగర్లోని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రి శ్రీధర్ బాబు, బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ, ఉద్యోగ నియామక ప్రక్రియ వంటి కీలక అంశాలపై ప్రస్తావన పెట్టారు. ఆయన బీసీ రిజర్వేషన్లపై బీజేపీ వైఖరి గురించి ప్రశ్నిస్తూ, త్వరలో అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లపై తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. అలాగే, బీజేపీ నిజంగా బీసీలకు న్యాయం చేయాలని చూస్తే, పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేస్తుందా లేదా? అని స్పష్టంగా ప్రశ్నించారు.
ఎస్సీ వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కార మార్గాన్ని సూచించిందని చెప్పారు. ఆయన ఈ సందర్బంగా తెలంగాణ ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు లాభాలు చేకూర్చిందని పేర్కొన్నారు.
Bird Flu : ఘోరంగా పడిపోయిన చికెన్ అమ్మకాలు..
శ్రీధర్ బాబు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత యువతకు ఉద్యోగ అవకాశాలు సృష్టించిన విషయాన్ని గుర్తుచేస్తూ, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పారదర్శకమైన విధానంతో ఉద్యోగ నియామక ప్రక్రియను ప్రారంభించామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో సాంకేతిక సమస్యల కారణంగా వేలాదిమంది యువత ఉద్యోగాలు పొందకపోయారని విమర్శించారు.
బీఆర్ఎస్, బీజేపీలు ఒకరికొకరు మద్దతు ఇస్తున్నారని ఆరోపించిన మంత్రి, తెలంగాణ ఏర్పడిన తర్వాత మాత్రమే గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలయిందని, అది కూడా కాంగ్రెస్ హయాంలోనే విడుదలైనట్లు వివరించారు. బీజేపీకి నిజంగా ఉద్యోగ నియామకాలపై ఆసక్తి ఉంటే, ఆ సమయంలో ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ల జారీ చేసినప్పుడు, బీజేపీ వాటిని అడ్డుకోవడానికి మాత్రమే ప్రయత్నించిందని మండిపడ్డారు.
ఇప్పుడు బీజేపీ తన వైఖరిని స్పష్టంగా తెలియజేయాలని మంత్రి శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వంపై అవాస్తవ ఆరోపణలు చేస్తూ, అసలు ప్రజల కోసం నిజమైన అభివృద్ధి పనులు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Indiramma Illu : ఇందిరమ్మ ఇళ్లు లబ్దిదారులకు గుడ్న్యూస్.. ఇంటి డిజైన్ మీకు నచ్చినట్టే..!