మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivasa Reddy) పుట్టిన రోజు (Birthday) నేడు..ఈ తరుణంలో రెవెన్యూ శాఖ (Revenue Department) ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. ఆయన పుట్టిన రోజునే 70 మంది డిప్యూటీ కలెక్టర్లు (Deputy Collectors) మరియు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది. తాజా బదిలీలలో అదనపు కలెక్టర్లు (Additional Collectors), ఆర్డీవోలు, భూ సేకరణ అధికారులు, మరియు సివిల్ సప్లయిస్ వంటి విభాగాలలో పని చేస్తున్న వారిని బదిలీ చేశారు. ఎవరూ ఊహించని విధంగా కొన్ని ప్రాధాన్యత కలిగిన డివిజన్లకు అనేక మంది బదిలీ అయ్యారు. అయితే, డిప్యూటీ కలెక్టర్లు ఎల్ రమేష్, ఎన్ ఆనంద్ కుమార్, మరియు వి. హనుమా నాయక్ కు ఏ పోస్టింగ్ ఇవ్వకుండా, వారిని రెవెన్యూ శాఖలో రిపోర్ట్ చేయాలనుకుంటున్నారు.
ఈ బదిలీలు హైడ్రా విస్తరణ, కొత్త ఆర్వోఆర్ చట్టం, ధరణి స్థానంలో భూమాత, మరియు పెండింగ్ భూ సమస్యల పరిష్కారం వంటి అనేక అంశాల నేపథ్యములో జరిగినట్లు తెలుస్తుంది. భూ పరిపాలనలో అనేక సంస్కరణలు రానున్నందున, మంత్రి పొంగులేటి వీటన్నింటిని సమర్థంగా అమలు చేయడానికి అవసరమైన ప్లాట్ ఫారమ్ను ఏర్పాటు చేయబోతున్నారు. ఈ చర్యలు రెవెన్యూ శాఖలో కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సహాయపడుతాయనేది స్పష్టంగా కనిపిస్తోంది.
Read Also : Karan Arjun : షారుక్-సల్మాన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్