Siddipet : సిద్దిపేటలో 1000 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభించిన మంత్రి హ‌రీష్‌రావు

సిద్దిపేటలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అనుబంధంగా 1000 పడకల ఆసుపత్రిని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్

  • Written By:
  • Publish Date - October 5, 2023 / 08:49 PM IST

సిద్దిపేటలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అనుబంధంగా 1000 పడకల ఆసుపత్రిని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు గురువారం ప్రారంభించారు. ప్రారంభోత్సవం అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వాసుపత్రిలో 2016లో 100 పడకల సంఖ్య ఉండగా 1000కు పెంచామన్నారు. రాష్ట్రంలో మెడికల్‌ సీట్లు, మెడికల్‌ కాలేజీలు ఎన్నో రెట్లు పెంచిన తర్వాత తెలంగాణలో గతానికి భిన్నంగా దినసరి కూలీల పిల్లలు కూడా ఎంబీబీఎస్‌ చదువుతున్నారని హరీశ్‌రావు అన్నారు. కళాశాలలో 175 సీట్లు ఉన్నాయని, దేశంలోని వివిధ ప్రాంతాల నుండి 25 మంది విద్యార్థులు చేరతారని, మిగిలిన సీట్లు స్థానిక విద్యార్థులకు రిజర్వ్ చేయబడతాయని మంత్రి హ‌రీష్ రావు తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

కొత్తగా ప్రారంభించిన ఆసుపత్రిలో 40 పడకల డయాలసిస్ కేంద్రం, 15 ఆపరేషన్ థియేటర్లు, 8 మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు, 100 ఐసీయూ పడకలు, 30 పడకల అత్యవసర వార్డు ఉన్నాయని తెలిపారు. ఇందులో రోగులకు సేవలందించేందుకు 280 మంది వైద్యులు, 150 మంది హౌస్ సర్జన్లు ఉంటారన్నారు. అదనంగా, కళాశాలలో 13 పీజీ విభాగాలు ఉండగా, ఆరోగ్య శాఖ అదనంగా 3 విభాగాలకు అనుమతి పొందే ప్రక్రియలో ఉందని మంత్రి హ‌రీష్‌రావు తెలిపారు. 50 పడకల సూపర్ స్పెషాలిటీ క్రిటికల్ కేర్ బ్లాక్‌ను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు హరీశ్ తెలిపారు. ఆసుపత్రిలో ప్రథమ చికిత్స నుండి ప్రాణాంతక వ్యాధుల చికిత్స వరకు ఆరోగ్య సంరక్షణ సేవలను అందించనున్నట్లు మంత్రి హ‌రీష్ రావు తెలిపారు.

Also Read:  Telangana Pre Poll Survey 2023 : కారు స్పీడ్ కు బ్రేకులు..కాంగ్రెస్ జోరు..దరిదాపుల్లో లేని బిజెపి