తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి.. కాషాయంలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 25 లేదా 26 వ తేదీన ఢిల్లీ పెద్దల సమక్షంలో కాషాయ కండువా కప్పుకుంటున్నట్లు వెల్లడించారు. తెలంగాణలో టీఆర్ఎస్ ను ఎదుర్కొనే సత్తా కేవలం బీజేపీకి మాత్రమే ఉందన్నారు.
అందుకే తాను ఆ పార్టీలోకి వెళ్తున్నట్లు స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలోని కొందరు నేతలు పార్టీని భ్రష్టు పట్టించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం సనత్ నగర్ లోని తన కార్యాలయంలో తన అనుచరులు, నియోజకవర్గ కాంగ్రెస్ నేతలతో సమావేశం అనంతరం శశిధర్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
శశిధర్ రెడ్డి వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేతలు ధీటుగా సమాధానం ఇస్తున్నారు. ఎన్నికల్లో గెలవలేని ఇలాంటి నేతలు ఉంటే ఎంత పోతే ఎంత. కాంగ్రెస్ పైనా రేవంత్ రెడ్డి పైనా విమర్శలు చేసే నైతిక హక్కు ఆయనకు లేదని మండిపడుతున్నారు.