CM Revanth Reddy: సీఎం రేవంత్రెడ్డి నివాసం వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. జూబ్లీహిల్స్లోని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నివాసం ఎదుట ఓ వ్యక్తి డీజిల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన వెలుగుచూసింది. ముఖ్యమంత్రి కార్యాలయం తనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని ఒంటి మీద కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. అక్కడే ఉన్న పోలీసులు అప్రమత్తమై, ఆ వ్యక్తిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. అతడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు ఈ పనికి యత్నించాడన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
We’re now on WhatsApp : Click to Join
అయితే ఆత్మహత్యాయత్నం చేసింది కాంగ్రెస్ కు చెందిన వ్యక్తి అని తెలుస్తోంది. కొత్తగా పార్టీలో చేరే వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని, తనలాంటి వారికి కాంగ్రెస్ లో గుర్తింపు దక్కకపోవడంతోనే అతను ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం. అందుకే సీఎం రేవంత్ రెడ్డి నివాసం వద్ద ఆత్మహత్యాయత్నం చేసి సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లడానికి ఈ పని చేసినట్లు తెలుస్తుంది.
Also Read: BJP: బీజేపీ మేనిఫెస్టో కమిటీని ప్రకటించిన జేపీ నడ్డా