KTR Strategy: కేటీఆర్ అమెరికా టూర్ రహస్యమిదే..!

సన్నిహితుల కు టికెట్లు రాకపోవడంతో ఇబ్బంది పడకుండా ఉండేందుకు కేటీఆర్ అమెరికా వెళ్లిపోయారని సమాచారం.

  • Written By:
  • Updated On - August 28, 2023 / 11:34 AM IST

BRS వర్కింగ్ ప్రెసిడెంట్, IT మంత్రి, K.T. రామారావు ఆగస్టు 20 నుంచి అమెరికాలో పర్యటిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కుమారుడు కేటీఆర్‌ ఆగస్టు 20న 115 మంది బీఆర్‌ఎస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించడానికి సరిగ్గా ఒకరోజు ముందు అమెరికా వెళ్లారు. అయితే కెటిఆర్‌ సన్నిహితులుగా పేరుగాంచిన బిఆర్‌ఎస్‌ నేతలు కొందరికి ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీ టిక్కెట్లు రాలేదు. దీంతో కేటీఆర్‌కు అభ్యర్థుల జాబితా ముందే తెలిసిపోయిందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.

టిక్కెట్ల కోసం తన సన్నిహితుల నుంచి ఒత్తిళ్లు వస్తాయని, వారికి కూడా టికెట్లు రాకపోవడంతో ఇబ్బంది పడకుండా ఉండేందుకు కేటీఆర్ అమెరికా వెళ్లిపోయారని సమాచారం. కేటీఆర్ సన్నిహితులైన మన్నె క్రిశాంక్, ఎర్రోళ్ల శ్రీనివాస్, శంభీపూర్ రాజు, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, బొంతు రామ్మోహన్ తదితరులు టిక్కెట్లు ఆశించారు. అయితే కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో ఈ పేర్లేవీ కనిపించలేదు. రాజకీయ ఒత్తిళ్ల వల్ల క్రిశాంక్‌ వంటి అర్హులైన, సమర్థులైన కొందరికి టిక్కెట్లు ఇవ్వలేకపోయామని, ప్రజలకు సేవ చేసేందుకు పార్టీ ఇతర అవకాశాలను కల్పిస్తుందని కేటీఆర్‌ ఆగస్టు 21న ట్విట్టర్‌లో తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.

కెటిఆర్ తన కొడుకు హిమాన్షుని యుఎస్ యూనివర్శిటీలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులో చేర్చిన వెంటనే హైదరాబాద్‌కు తిరిగి రావాల్సి ఉంది. అయితే వారం గడిచినా కేటీఆర్ తిరిగి రాలేదు. టీఎస్‌లో పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇన్వెస్టర్లతో సమావేశాల పేరుతో కేటీఆర్ ఇప్పుడు అమెరికా పర్యటనను పొడిగించారు. ఇటీవ‌ల మే నెల‌లో పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షించేందుకు కేసీఆర్ రెండు వారాల పాటు అమెరికాలో ప‌ర్య‌టించారు. అంతకుముందు రెండు నెలల గ్యాప్‌లో పెట్టుబడుల కోసం కేటీఆర్ ఎప్పుడూ అమెరికా వెళ్లలేదని బీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. తన సన్నిహితుల నుంచి టిక్కెట్ల కోసం ఒత్తిడి రాకుండాఉండేందుకు పెట్టుబడుల ముసుగులో అమెరికా పర్యటనను పొడిగించేందుకు మాత్రమే కేటీఆర్ ప్రయత్నిస్తున్నారని వారు అనుమానిస్తున్నారు.