హైదరాబాదులోని నిర్మాణం చేసిన స్టీల్ బ్రిడ్జ్ కి నాయిని నరసింహారెడ్డి ఫ్లై ఓవర్ గా నామకరణం చేశారు. ముఖ్యమంత్రి సూచన మేరకు ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు పురపాలక శాఖ జారీ చేసింది. ముషీరాబాద్ లో సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో, జిఎస్టి కార్మిక సంఘం నాయకుడిగా నాయిని గారు చేసిన సేవలకు స్మరించుకునేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ ప్రజా రవాణాలో మరో మైలురాయి చేరనున్నది. సుమారు 450 కోట్ల రూపాయలతో ఇందిరాపార్క్ నుంచి విఎస్టీ వరకు నిర్మించిన స్టీల్ బ్రిడ్జి ఈనెల 19వ తేదీన ప్రారంభం కానున్నది.
2.63 కిలోమీటర్ల పొడవైన ఈ స్టీల్ బ్రిడ్జి నిర్మాణాన్ని జిహెచ్ఎంసి స్టాటజిక్ రోడ్డు డెవలప్మెంట్ ప్రోగ్రాం (SRDP) లో భాగంగా చేపట్టింది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి హోంశాఖ మంత్రివర్యులుగా పనిచేసిన కీర్తిశేషులు నాయిని నరసింహారెడ్డి పేరును ఈ స్టీల్ బ్రిడ్జి ఫ్లైఓవర్ కి పెట్టనున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ స్టీల్ బ్రిడ్జ్ కి నాయిని పేరు పెడుతున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.
ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ఆదేశాలను జారీ చేయనున్నది. సుదీర్ఘ కాలం పాటు ముషీరాబాద్ కేంద్రంగా రాజకీయాల్లో పాల్గొని తెలంగాణ ఉద్యమానికి అనేక సేవలందించిన నాయిని నర్సింహారెడ్డి, అక్కడే ఉన్న విఎస్టీ ఫ్యాక్టరీ కార్మికుల యూనియన్ నాయకుడిగా దశాబ్దాల పాటు పనిచేశారు. ఈ నేపథ్యంలో ఈ రెండు ప్రాంతాల్లో నాయిని గారి సేవలను దృష్టిలో ఉంచుకొని నాయిని నరసింహారెడ్డి పేరును ఈ స్టీల్ బ్రిడ్జికి పెట్టేందుకు ప్రభుత్వ నిర్ణయం తీసుకుందని మంత్రి కేటీఆర్ తెలిపారు.