Site icon HashtagU Telugu

KTR: చేసింది చెప్పకపోవడమే మా తప్పు: కేటీఆర్

KTR

KTR

KTR: చేసిన మంచి పనుల గురించి ప్రచారం చేయాలని బిఆర్ఎస్ నాయకులకు పిలుపునిచ్చారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చేసిన పనిని వివరించలేకపోవడం గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి దారితీసిందని అన్నారు. సోమవారం నల్గొండ పార్లమెంట్‌ నియోజకవర్గ కేడర్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. “నిన్న కేసీఆర్ ఇదే ప్రాంతంలో ఉన్నారు. ప్రజల నుంచి భారీ స్పందన కనిపించింది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ ఎలా ఓడిపోయామో అని ఆశ్చర్యపోయాను’’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

బీఆర్‌ఎస్ ఓటమిని పరిశీలించేందుకు ఉస్మానియా యూనివర్శిటీ పండితుల సహాయాన్ని కోరామని, ప్రజలను నమ్మించడంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు విఫలమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు కేటీఆర్. “గిరిజన కుగ్రామాలు ఎందుకు ఓటు వేయలేదో ఓయూ పరిశోధనా బృందం రెండు నెలల తర్వాత నివేదిక ఇచ్చిందని అన్నారు కేటీఆర్. ఉద్యోగాలు ఇవ్వలేదని యువత నమ్మినాట్లు స్పష్టం చేశారు కేటీఆర్. అయితే బీఆర్‌ఎస్‌ 1.62 లక్షల ఉద్యోగాలు ఇస్తే, సీఎం రేవంత్‌ రెడ్డి 30 వేల ఉద్యోగాలకు నియామక ఉత్తర్వులు ఇచ్చారని కేటీఆర్‌ అన్నారు. కరోనా ప్రభావం నుంచి ప్రభుత్వం పూర్తిగా కోలుకోలేదని తెలిసినా ప్రతినెలా ఒకటో తేదీన జీతాలు విడుదల చేయకపోవడంతో చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఓటు వేశారని అన్నారు.

We’re now on WhatsApp : Click to Join

కేసీఆర్ రైతులకు మేలు చేశారు. అయితే తప్పు మన నాయకులది తప్ప ప్రజలది కాదు. కేసీఆర్‌ను మేం విఫలం చేశాం. ఇప్పుడు మనం కాంగ్రెస్‌ను ఓడించాలి, లేకుంటే వారి 100 రోజుల అబద్ధాలు తెలంగాణ ప్రజలను ముంచుతాయన్నారు. తమ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ఉద్దేశం బీఆర్‌ఎస్‌కు లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హామీ ఇచ్చిన కేటీఆర్, ఖమ్మం, నల్గొండకు చెందిన తమ పార్టీ నేతలతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

Also Read: Delhi Liquor Case : కవిత బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా