KTR Birthday: తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఈ రోజు జూలై 24న 47వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రొటీన్ గా కేక్ కట్ చేయడమో, కార్యకర్తలతో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడమో కాకుండా ఈ ఏడాది వినుత్న కార్యక్రమాలకు తెరలేపారు. తన పుట్టినరోజు సందర్భంగా పేద పిల్లలకు సహాయం చేయాలనీ నిశ్చయించుకున్నాడు. 10, 12వ తరగతి విద్యార్థులకు ల్యాప్ టాప్, రెండు సంవత్సరాల కోచింగ్ ఇప్పించనున్నట్టు ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
Have been thinking of a meaningful way to contribute to the orphan children of the State home, Yousufguda run by Women & Child Welfare Department
Tomorrow on the occasion of my 47th birthday I pledge to personally support 47 meritorious children from 10th/12th grades and 47…
— KTR (@KTRBRS) July 23, 2023
మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో యూసుఫ్గూడలో ఉన్న స్టేట్ హోంలోని అనాథ పిల్లలకు తన వంతు సాయం చేయాలని నిర్ణయించుకున్నారు మంత్రి కేటీఆర్. ఈ మేరకు 10, 12వ తరగతుల్లో ప్రతిభావంతులైన 47 మంది పిల్లలకు, ప్రొఫెషనల్ కోర్సుల నుంచి మరో 47 మంది పిల్లలకు వ్యక్తిగతంగా అండగా ఉంటానని తెలిపారు. ఈ విద్యార్థులందరికీ ఉచితంగా ల్యాప్ టాప్లు అందిస్తానని శపధం చేశారు. రెండేండ్ల పాటు కోచింగ్ ఇప్పిస్తానని పేర్కొన్నారు. కేటీఆర్ తీసుకున్న నిర్ణయానికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో నెటిజన్స్ లీడర్ అంటూ ప్రశంసిస్తున్నారు.
Also Read: Ram Charan : చరణ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంత ? దాంతో ఏం కొన్నాడో తెలుసా..?