Ugadi 2024: శ్రీ క్రోధి నామ సంవత్సర తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం సందర్భంగా తెలంగాణ భవన్లో ఉగాది వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకలకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. తెలంగాణ భవన్లో జరిగిన ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొని కొద్దిసేపు అందరితో సరదాగా గడిపారు.
ఈ వేడుకల్లో బీఆర్ఎస్ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు, శాసనసభ్యులు, ఎంపీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ .. భారతదేశంలో మరియు విదేశాలలో నివసిస్తున్న తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉగాది రోజున రాజకీయాలు మాట్లాడకూడదని నిర్ణయించారు. దేశంలో మతసామరస్యం నెలకొనాలని ఆశిస్తున్నాను అని కేటీఆర్ అన్నారు. తెలుగు నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్రంలో వ్యవసాయరంగంలో పునరుజ్జీవనం పొందాలని, తద్వారా రైతులు, సమాజం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
తెలంగాణ భవన్ లో జరిగిన ఉగాది పంచాంగ శ్రవణంలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS మరియు మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నాయకులు.
భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క తెలుగు సోదర, సోదరీమణులందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర… pic.twitter.com/s5vMdhiTSO
— BRS Party (@BRSparty) April 9, 2024
ఇదిలా ఉండగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఉగాది వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. ఉగాది రోజు తెలుగు లోగిళ్లలో భక్తిశ్రద్ధలతో పూజలు చేసి, పంచాంగ శ్రవణం ఆలకిస్తారు. పండితులు చెప్పే రాశి ఫలాలను శ్రద్ధగా ఆలకిస్తారు. ఈ పర్వదినాన తీపి, కారం, వగరు, ఉప్పు, పులుపు, చేదు వంటి షడ్రుచులతో చేసిన ఉగాది పచ్చడిని సేవిస్తారు.
Also Read: Tata Punch EV: టాటా పంచ్ EVపై మెదటిసారిగా భారీ తగ్గింపు..!