KTR: క్రిశాంక్ ను వెంటనే విడుదల చేయాలి.. సీఎం రేవంత్ పై కేటీఆర్ ఫైర్

  • Written By:
  • Publish Date - May 8, 2024 / 01:33 PM IST

KTR: చంచల్ గూడ జైల్లో క్రిశాంక్ ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిశాంక్‌ పై ఒక పనికిమాలిన కేసు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వేధిస్తుందని, అసలు తప్పు చేసి రేవంత్ రెడ్డి జైల్లో ఉండాల్సింది పోయి… బయట తిరుగుతున్నాడని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే నువ్వు పెట్టిన సర్క్యూలర్, క్రిశాంక్ పెట్టిన సర్క్యూలర్ ను నిపుణుల ముందు పెడతాం అని సవాల్ విసిరారు.

ఏదీ వర్జినలో ఏదీ డూప్లికేటో తేలుద్దాం. ఆ తర్వాత ఎవరు చంచల్ గూడలో ఉండాలో తేలిపోతదని, క్రిశాంక్ పోస్ట్ చేసిన సర్క్యూలర్ తప్పా..! చేయని తప్పుకు క్రిశాంక్‌ను జైల్లో వేశారని ఫైర్ అయ్యారు కేటీఆర్. క్రిశాంక్ ను ఉద్దేశ పూర్వకంగానే జైల్లో వేశారని, ఇకనైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిగ్గు తెచ్చుకొని చేసిన తప్పును సరిదిద్దుకోవాలని హితవు పలికారు. సర్కార్ చేసిన వెదవ పనికి వెంటనే క్షమాపణ చెప్పాలని, ఏ తప్పు చేయని క్రిశాంక్ ను వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ చేశారు.