Revanth Reddy: టీఆర్ఎస్, బీజేపీ వైఫల్యాలపై రేవంత్ చార్జిషీట్!

శనివారం మునుగోడులో జరిగిన సభలో టీఆర్‌ఎస్‌, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిల వైఫల్యాలపై టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి చార్జిషీట్‌ విడుదల చేశారు.

  • Written By:
  • Updated On - September 4, 2022 / 01:12 AM IST

శనివారం మునుగోడులో జరిగిన సభలో టీఆర్‌ఎస్‌, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిల వైఫల్యాలపై టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి చార్జిషీట్‌ విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ.. కోమటిరెడ్డి రాజీనామాతో కేసీఆర్‌ ప్రభుత్వం మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో అర్హులైన లబ్ధిదారులకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు పంపిణీ చేయలేదన్నారు. మునుగోడు సెగ్మెంట్‌లో 97 వేల మంది ఓటర్ల ఓట్లను రూ.22 వేల కోట్లకు ప్రధాని మోదీకి కోమటిరెడ్డి రాజగోపాల్ అమ్ముకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

ఉప ఎన్నికల్లో బీజేపీ గుర్తుపై పోటీ చేస్తున్న రాజ్‌గోపాల్‌కు ఓట్లు వేయవద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.  కాంగ్రెస్‌ను వీడి రాజ్‌గోపాల్‌తో కలిసి బీజేపీలో చేరిన నాయకులు ఓట్లు అడిగేందుకు వస్తే తరిమికొట్టాలని రేవంత్ ప్రజలకు పిలుపునిచ్చారు. అందరూ ఐక్యంగా పనిచేస్తేనే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి సమావేశంలో కాంగ్రెస్ నాయకులు, మద్దతుదారులు,  మునుగోడు నేతలు పాల్గొన్నారు.