వినాయక చవితి అనగానే.. తెలంగాణ ప్రజలకు ముందుగా గుర్తుకవచ్చేది ఖైరతాబాద్ గణేషుడు. ఖైరతాబాద్ గణేష్ విగ్రహాన్ని చూసేందుకు జనం పోటెత్తారు. ఆ ప్రాంత పరిసరాలు పండుగ శోభతో కళకళలాడుతాయి. COVID-19 మహమ్మారి కారణంగా 2020లో 9 అడుగుల విగ్రహానికి భిన్నంగా, ఈ సంవత్సరం విగ్రహం 51 అడుగుల పొడవులో కనువిందు చేయనున్నాడు.
యూట్యూబర్లలో ఒకరు డ్రోన్ సహాయంతో ఫస్ట్ లుక్ పూజ వీడియోను విడుదల చేశారు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ కమిటీ సభ్యులు ప్రారంభించిన విధానాన్ని వివరించారు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ కమిటీ 86 రోజుల పాటు 150 మంది కళాకారులతో కలిసి మట్టి, సహజ రంగులను ఉపయోగించి 2022 లో గణేష్ చతుర్థి కోసం పర్యావరణ అనుకూల గణేశ విగ్రహాన్ని తయారు చేసింది. ఈ ఏడాది శ్రీ పంచముఖ మహాలక్ష్మి గణపతిగా వెలిసిన విగ్రహాన్ని భక్తులు దర్శించుకోవచ్చు.