Telangana: ప్రశాంత్ కిషోర్‌ తో కేసీఆర్ రహస్య చర్చలు, గెలుపు లక్ష్యంగా మంతనాలు?

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఎలాగైనా విజయం సాధించేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. 

Published By: HashtagU Telugu Desk
Prashant Kishore KCR

Prashant Kishore KCR

Telangana: ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ బీఆర్ఎస్ కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని రాజకీయ విమర్శకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో, భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఎలాగైనా విజయం సాధించేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది.

తాజా నివేదికల ప్రకారం, ఎన్నికల్లో విజయం సాధించేందుకు చివరి నిమిషంలో వ్యూహాలు రచించేందుకు ప్రముఖ రాజకీయ వ్యూహకర్త, ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-పీఏసీ) వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్‌ను కేసీఆర్ పిలిచి రహస్య చర్చలు జరిపినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని మరో రాజకీయ వ్యూహకర్త గురురాజ్ అంజన్ తన సోషల్ మీడియా హ్యాండిల్ ఎక్స్‌లో వెల్లడించారు.

“తెలంగాణలో అతిపెద్ద సంచలనం: #TelanganaAssemblyElections2023 #PKMeetsKCR” అని ఆయన వెల్లడించారు. అంజన్ ప్రకారం.. రాష్ట్ర ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్ BRS పతనాన్ని అంచనా వేసింది. దీంతో కేసీఆర్, పీకే మధ్య మూడు గంటల పాటు చర్చలు జరిగినట్టు సమాచారం. అయితే  ఇప్పుడు రాబోయే తొమ్మిది రోజుల్లో BRS కోసం PK ఏమి సాధించగలదనే ప్రశ్న తలెత్తుతుంది. కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకోవడం, అధికార పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదగడం లాంటివి కేసీఆర్ కు సవాల్ గా మారాయని కాంగ్రెస్ నాయకులు అభిప్రాయ పడుతున్నారు.

Also Read: KTR: ప్రభుత్వ ఉద్యోగ నియామకాల వైబ్ సైట్ ను ప్రారంభించిన కేటీఆర్

  Last Updated: 22 Nov 2023, 12:09 PM IST