Site icon HashtagU Telugu

Jubilee Hills: జూబ్లీహిల్స్ ఫలితాలపై కేసీఆర్ రియాక్షన్ !!

Kcr Jublihils

Kcr Jublihils

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ఫలితాలు స్పష్టమవుతున్న కొద్దీ కాంగ్రెస్ శిబిరంలో ఉత్సాహం ఊపందుకుంటోంది. తొమ్మిది రౌండ్లు పూర్తయ్యేసరికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 23 వేలకు పైగా మెజారిటీ సాధించడం, ఈ ఉపఎన్నికలో ప్రజలు కాంగ్రెస్‌కు గట్టి మద్దతు ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. మొదటి రౌండ్ నుంచే ఆధిక్యం దక్కించుకున్న నవీన్ యాదవ్ ప్రతి రౌండ్‌లో మెజారిటీని పెంచుకుంటూ వేగంగా దూసుకుపోతున్నారు. జూబ్లీహిల్స్ వంటి ప్రతిష్టాత్మక పట్టణ నియోజకవర్గంలో ఇంత భారీ మెజారిటీ రావడం కాంగ్రెస్‌కు రాజకీయంగా పెద్ద బూస్ట్‌గా మారింది. పార్టీ కార్యకర్తలు, నేతలు, అభిమానులు గాంధీ భవన్ వద్ద బాణాసంచా కాలుస్తూ విజయోత్సాహంలో మునిగిపోయారు.

Bihar Election Results : బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం..2 లక్షల గులాబ్ జాము, మోతీ చూర్ లడ్డూలు సిద్ధం

ఈ నేపథ్యంలో మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ స్పందించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఎన్నికల ఫలితాలు తమకు ప్రతికూలంగా వచ్చినప్పటికీ, ఈ పోరులో బీఆర్‌ఎస్ నైతికంగా గెలిచిందనే వ్యాఖ్యలు చేశారు. ఫలితాల కారణంగా పార్టీ కార్యకర్తలు అధైర్యపడాల్సిన అవసరం లేదని, పోరాటస్ఫూర్తిని కొనసాగించాలని వారికి హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీ గెలుపుపై ఆయన విమర్శలు చేస్తూ, బెదిరింపులు, అక్రమ పద్ధతులు, ఒత్తిడి రాజకీయాల ద్వారా కాంగ్రెస్ విజయం సాధించిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు బీఆర్‌ఎస్ మరింత కష్టపడుతుందని, తమ పోరాటం ఇక్కడితో ఆగిపోదని కేసీఆర్ స్పష్టం చేశారు.

రానున్న ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మళ్లీ పుంజుకుంటుందనే ధీమాను కేసీఆర్ వ్యక్తం చేయడం, పార్టీ శ్రేణుల్లో నమ్మకాన్ని పెంచే ప్రయత్నంగా ఉంది. జూబ్లీహిల్స్ ఫలితాలు బీఆర్‌ఎస్‌కు వెనుకడుగు అయినప్పటికీ, రాజకీయంగా తమ బలం తగ్గలేదని ఆయన చెప్పేందుకు ప్రయత్నించారు. కాంగ్రెస్ ఈ భారీ విజయాన్ని రాష్ట్రవ్యాప్తంగా తమ బలమైన పునఃస్థాపనగా భావిస్తోంది. ఉపఎన్నికలు సాధారణంగా ప్రభుత్వాల పనితీరుపై ఓటర్ల అభిప్రాయాన్ని ప్రతిబింబిస్తాయని భావిస్తే, జూబ్లీహిల్స్ ఫలితాలు రాబోయే రాజకీయ సమీకరణల్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.

Exit mobile version