KCR: ఎర్రవెల్లి లో కేసీఆర్ సమావేశం, బీఆర్ఎస్ ఎంపీలకు దిశానిర్దేశం!

  • Written By:
  • Updated On - January 26, 2024 / 05:26 PM IST

KCR: తెలంగాణ హక్కులకోసం పోరాడే దళం బిఆర్ఎస్ పార్టీ ఒక్కటేనని, రాబోయే పార్లమెంటు సమావేశాల్లో బిఆర్ఎస్ ఎంపీలు తెలంగాణ హక్కుల సాధన కోసం గళం విప్పాలని బీఆర్ఎస్ అధినేత పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం శుక్రవారం నాడు ఎర్రవెల్లి నివాసంలో కేసీఆర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో రాజ్యసభ, లోకసభ పార్లమెంటరీ పార్టీ నేతలు కె కేశవరావు, నామా నాగేశ్వర్ రావు సహా పార్టీ ఎంపీ లు హాజరయ్యారు.

ఈ నెల చివరలో ప్రారంభమై వారం రోజులపాటు సాగనున్న పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ తరపున బలమైన వాదనలు వినిపించాలని కేసీఆర్ ఎంపీ లకు స్పష్టం చేసారు. నదీ జలాల కేటాయింపులు, ఉమ్మడి ఆస్తుల పంపకాలతో పాటు పెండింగు లో వున్న రాష్ట్ర విభజన హామీల సాధనకోసం ఇప్పడికే ఎన్నో పోరాటాలు చేసిన చరిత్ర బిఆర్ఎస్ పార్టీదేనన్నారు. కాగా నాడైనా నేడైనా తెలంగాణ హక్కులకు భంగం వాటిల్లే సందర్భాల్లో అడ్డుకుని కాపాడలవలసిన బాధ్యత మరోసారి బిఆర్ఎస్ ఎంపీలదేనని స్పష్టం చేశారు.

దాదాపు మూడు గంటల పాటు సాగిన సమావేశంలో, పార్లమెంటు ఉభయ సభల్లో, పలు అంశాలపై అనుసరించాల్సిన వ్యూహాలను చర్చించాల్సిన విధానాలపై అధినేత కేసీఆర్ ఎంపీ లకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో రాములు, బీబీ పాటిల్, పసునూరి దయాకర్, మన్నె శ్రీనివాస్ రెడ్డి, కెఆర్ సురేష్ రెడ్డి, వెంకటేష్ నేతకాని, బడుగుల లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్ర, మలోత్ కవిత, పార్థసారథి రెడ్డి, జోగినపల్లి సంతోష్ కుమార్, దేవకొండ దామోదర్ రావు, గడ్డం రంజిత్ రెడ్డి…వీరితో పాటు కేటీఆర్ హరీష్ రావు లు పాల్గొన్నారు.

Also Read: AP News: లోక్ సభ బరిలో మాజీ మంత్రి అనిల్, ఆ స్థానం నుంచి పోటీ?