తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఆగస్టు 4న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. బంజారాహిల్స్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని విభాగాలను సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పర్యవేక్షించారు. ప్రారంభోత్సవానికి ముందే పెండింగ్లో ఉన్న పనులన్నింటినీ పూర్తి చేయాలని కోరారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణం చారిత్రాత్మకంగా సాగుతోందని, అయితే లాజిస్టిక్స్, ప్లానింగ్, ఎగ్జిక్యూషన్కు సంబంధించి పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయాలన్నారు.
కమాండ్ సెంటర్ ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని, తద్వారా హైదరాబాద్ సిటీ పోలీసుల ఖ్యాతిని పెంచాలని సీవీ ఆనంద్ పేర్కొన్నారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో పోలీసు శాఖలోని వివిధ విభాగాలన్నీ ఒకే ప్లాట్ఫారమ్పై పనిచేస్తాయి. కమాండ్ కంట్రోల్ సెంటర్ను పోలీస్ టవర్స్ అని పిలుస్తారు, రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన దాదాపు 9.25 లక్షల కెమెరాలు ఈ కేంద్రంలో పర్యవేక్షించబడతాయి. నేరాలు, చోరీలు అరికట్టడంలో ప్రధాన ప్రాత వహిస్తుంది.