Site icon HashtagU Telugu

KCR New Year Gift: తెలంగాణ ల్యాండ్ ఓనర్స్ కు ‘కేసీఆర్’ న్యూయర్ కానుక!

Kcr

Kcr

మునుగోడు ఉప ఎన్నిక అందించిన విజయంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చేందుకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం భూ యజమానులకు (సొంత జాగాలు) 3 లక్షలు మంజూరుచేసేందుకు సిద్ధమవుతోంది.  తెలంగాణలో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ పథకం అమలుకానుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు సంక్షేమ శాఖ, వివిధ అనుబంధ శాఖలు పథకం పర్యవేక్షణ విభాగంతో పాటు మార్గదర్శకాల తయారీ ప్రక్రియను ప్రారంభించాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికల ప్రకటనకు ముందే ఈ పథకాన్ని ప్రచారం చేసేందుకు టీఆర్ఎస్ ఇప్పట్నుంచే సన్నాహాలు చేస్తోంది.

డబుల్ బెడ్‌రూం ఫ్లాట్‌ల పంపిణీ సందర్భంగా ప్లాట్‌ హోల్డర్‌లకు సొంత ఇళ్ల నిర్మాణానికి 3 లక్షల రూపాయలను అందించే పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది. గతేడాది ఈ పథకానికి సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వం వెల్లడించినా అది అమలు కాకపోవడంతో ప్రస్తుతం రూ. 5 లక్షల నుంచి రూ. 3 లక్షలు ఈ పథకాన్ని అమలు చేయాలని భావిస్తోంది. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం 3000 మంది లబ్ధిదారులను గుర్తించి, వారికి రూ.3 లక్షల సాయం అందించాలని యోచిస్తోంది.

సంక్షేమ శాఖ ప్రకారం.. ఈ పథకం ప్రజలకు కొత్త సంవత్సర కానుకగా అమలుకాబోతోంది. అయితే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 10 నెలల సమయం ఉండడంతో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకే టీఆర్ఎస్ దూకుడుగా ముందుకు సాగుతోంది. ఆసరా పింఛన్‌, దళితుల బంధు పథకంతో పాటు సొంత ఇళ్ల నిర్మాణానికి రూ.3 లక్షల సాయం అందించే పథకం ద్వారా ప్రజలు లబ్ధి పొందుతారని అధికార పార్టీ నాయకులు తెలిపారు.