Site icon HashtagU Telugu

KCR Political Strategy: కేసీఆర్ జిల్లాల పర్యటన షురూ! ముందస్తు సంకేతమా?

CM kcr and telangana

CM KCR Telangana

ప్రత్యేక క్యాబినెట్ సమావేశం, అసెంబ్లీ ఈ నెల 21న పెడుతున్న కేసీఆర్ జిల్లాల పర్యటన కూడా షురూ చేశారు. సేమ్ తో సేమ్ 2018 ఎన్నికల ముందు ఎలా అడుగులు వేశారో అదే తరహా వ్యూహం ఆయనలో కనిపిస్తుంది. ముఖ్యమంత్రి హోదాలో వివిధ జిల్లాలకు వెళ్లే షెడ్యూల్ ఫిక్స్ అయింది.
ఆగస్టు 14న వికారాబాద్‌లో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి, అనంతరం ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. సభకు భారీగా జనాన్ని సమీకరించాలని స్థానిక యూనిట్లను నాయకత్వం కోరింది.
ఆగస్టు 17న మేడ్చల్-మల్కాజిగిరిలో జరిగే మరో బహిరంగ సభలో రావు ప్రసంగిస్తారు.
వికారాబాద్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్‌ కాంప్లెక్స్‌ల (ఐసీసీ)తో పాటు టీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయాలను ఆయన ప్రారంభిస్తారు. వికారాబాద్‌లో ప్రభుత్వ మెడికల్ కళాశాలకు శంకుస్థాపన చేయనున్నారు.ఈ నెలాఖరులో నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, మహబూబ్‌నగర్, శంషాబాద్ (రంగా రెడ్డి), భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఐసీసీల ప్రారంభోత్సవం, టీఆర్‌ఎస్ కార్యాలయాల ప్రారంభోత్సవంతోపాటు బహిరంగ సభల్లో ప్రసంగించేందుకు ముఖ్యమంత్రి ప్లాన్ చేశారు.
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు పైలట్‌ రోహిత్‌రెడ్డి, మెతుకు ఆనంద్‌, కాలె యాదయ్య, పట్నం నరేందర్‌రెడ్డి చంద్రశేఖర్‌రావుతో పాటు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీ శాఖ మంత్రి కె.టి. రామారావు ప్రగతి భవన్‌లో ప్రత్యేకంగా సమావేశమై ఏర్పాట్లపై చర్చించారు.ముఖ్యమంత్రి కార్యక్రమాలకు జనసమీకరణపై చర్చించారు. ఇందుకోసం స్థానిక నాయకులతో సమన్వయంతో పని చేయాలని కోరారు. మొత్తం మీద కేసీఆర్ జిల్లా పర్యటనలు ముందస్తు సంకేతాలు ఇస్తున్నాయి.