KCR Delhi Tour: కేసీఆర్ ఢిల్లీ టూర్ రహస్యమిదే!

తెలంగాణ ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే.

  • Written By:
  • Publish Date - July 27, 2022 / 01:30 PM IST

తెలంగాణ ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆయన ఢిల్లీ పర్యటనలో ఏంచేయబోతున్నారా? ఏయే నిర్ణయాలు తీసుకోబుతున్నారు? లాంటి విషయాలపై పార్టీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అయితే కేసీఆర్ ఢిల్లీలో మూడు ముఖ్యమైన అంశాలపై దృష్టి సారించారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీఆర్‌ఎస్ ఎంపీలు తమ ఆందోళనను ఉధృతం చేయాలని కోరారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న సమస్యలను సంబంధిత మంత్రిత్వ శాఖలతో కొనసాగించాలని సీనియర్ ఐఏఎస్ అధికారులను ఆదేశించారు. జాతీయ రాజకీయాలపై కూడా దృష్టి సారించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా తొలిరోజైన మంగళవారం ముఖ్యమంత్రి పార్టీ ఎంపీలతో లంచ్‌లో సమావేశమయ్యారు. నరేంద్ర మోదీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పార్లమెంటు ఉభయ సభల్లో ఆందోళనను ఉధృతం చేయాలని కేసీఆర్ ఆదేశించారు.

ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఇరిగేషన్) రజత్ కుమార్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఆర్థిక) కె రామకృష్ణారావు, పంచాయతీ రాజ్ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాలను కూడా ఢిల్లీకి రావాలని రావు కోరారు. బ్యాక్‌వర్డ్ రీజియన్ గ్రాంట్ ఫండ్ విడుదల చేయకపోవడం, ఎన్‌ఆర్‌ఇజిఎస్ అమలు, పాలమూరు-రంగారెడ్డి వంటి నీటిపారుదల ప్రాజెక్టులకు అనుమతులు వంటి రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న సమస్యలను సంబంధిత మంత్రిత్వ శాఖలతో పరిష్కరించాలని కేసీఆర్ ఐఎఎస్ అధికారులను కోరినట్లు సమాచారం. ఈ పర్యటనలో జాతీయ  రాజకీయాలపై ఫోకస్ చేసే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఢిల్లీ పర్యటనలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అవుతారా లేదా అన్నదానిపై క్లారిటీ లేదు.