తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఇచ్చిన ఆరు హామీలను అమలు చేయగలదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విశ్వాసం వ్యక్తం చేశారు. ఇప్పుడున్నట్లుగా ఎలాంటి దోపిడీకి, కమీషన్ల దందా లేకుండా ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసే ప్రతి పైసాను సక్రమంగా వినియోగించుకుంటే ఈ హామీల అమలుకు నిధుల కొరత ఉండదని అన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు పథకాల ప్రయోజనాలను రాష్ట్ర ప్రజలకు అందకుండా చూడాలని బీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు కుట్ర పన్నారని, ఈ కుట్రను తిప్పికొట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం వంటి పలు పథకాల అమలులో కమీషన్ల రూపంలో భారీ అవినీతి చోటుచేసుకుందన్నారు. ‘కాళ్లేశ్వరం వంటి ప్రాజెక్టుల ముసుగులో బీఆర్ఎస్ మాదిరిగా మా ప్రభుత్వం 50 వేల కోట్ల రుణాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. బదులుగా, నిరుద్యోగ యువత మరియు కుటుంబాలకు ఉపాధి అవకాశాలను కల్పించడానికి బడ్జెట్ నుండి నిధులు ఖర్చు చేస్తాం” అని భట్టి చెప్పారు.
Also Read: Ahobilam: అహోబిలం నరసింహస్వామి ప్రసాదంతో ఆరోగ్యమస్తు!