KTR: మోడీ తరహాలో కేసీఆర్ మత రాజకీయాలు ఏనాడూ చేయలేదు: కేటీఆర్

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మతతత్వ పార్టీ బీజేపీని ఓడించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ కోసం బీజేపీ చేసిందేమీ లేదని అన్నారు. బుధవారం మేడ్చల్‌ నియోజకవర్గం మేడిపల్లిలో జరిగిన కేడర్‌ సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడుతూ

KTR: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మతతత్వ పార్టీ బీజేపీని ఓడించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ కోసం బీజేపీ చేసిందేమీ లేదని అన్నారు. బుధవారం మేడ్చల్‌ నియోజకవర్గం మేడిపల్లిలో జరిగిన కేడర్‌ సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడుతూ.. యాదాద్రి ఆలయాన్ని కేసీఆర్ కట్టించినా.. నరేంద్ర మోదీ అయోధ్య దేవాలయం తరహాలో రాజకీయ ప్రయోజనాల కోసం ఏనాడూ శ్రీలక్ష్మీనరసింహస్వామి పేరును ఉపయోగించలేదన్నారు.

బిఆర్‌ఎస్‌కు శ్రీరాముడి పట్ల భక్తి ఉంది, అయితే నరేంద్ర మోడీ మరియు బిజెపి లాగా మేము అతని పేరును ఓట్ల కోసం ఎన్నడూ ఉపయోగించము. రాముడు బీజేపీకి మాత్రమే చెందినవాడు కాదు, నా పేరులోనూ రాముడు ఉన్నాడు అని కేటీఆర్ అన్నారు. కోవిడ్ సమయంలో వలస కార్మికులు వారి స్వస్థలాలకు చేరుకోవడానికి రైళ్లను కూడా ఏర్పాటు చేయని నరేంద్ర మోడీని అత్యంత అమానవీయ ప్రధానిగా అభివర్ణించారు కేటీఆర్. కేసీఆర్ వలస కూలీలకు ఆహారం, రవాణా ఏర్పాటు చేశారని గుర్తు చేశారు.

We’re now on WhatsAppClick to Join

పార్లమెంట్‌లో బీఆర్‌ఎస్‌ గొంతు నొక్కేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కేటీఆర్‌ అన్నారు. అయితే బీఆర్‌ఎస్ మాత్రమే తెలంగాణ వాణిని పార్లమెంట్‌లో వినిపించగలదని స్పష్టం చేశారు కేటీఆర్ . భద్రాద్రి, ఘట్‌కేసర్‌ ఆలయాల అభివృద్ధికి సహకరించని కిషన్‌రెడ్డికి ఎందుకు ఓటు వేస్తారు? అని కేటీఆర్ ప్రశ్నించారు నరేంద్ర మోదీ ప్రభుత్వం వ్యాపారా వేత్తలకు రూ.15 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేశారన, అయితే అప్పుల ఊబిలో కూరుకుపోయిన పేద రైతులకు మోడీ చేసిందేమీ లేదని విమర్శించారు. నరేంద్ర మోదీ మరియు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరూ బీఆర్‌ఎస్‌ను నిర్వీర్యం చేయడానికి నీచ రాజకీయాలకు ఒడిగడుతున్నారని ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత రేవంత్‌రెడ్డి బీజేపీలో చేరాలని యోచిస్తున్నారు. రాహుల్ గాంధీ కంటే మోదీని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అని కేటీఆర్ అన్నారు.

Also Read: Janasena Campaigners : ప్రచారం కోసం స్టార్ క్యాంపెయినర్ల ను పవన్ దింపాడో లేదో..వైసీపీ సెటైర్లు స్టార్ట్