బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ మృతి నేపథ్యంలో పలువురు నేతలు కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వరుసగా వస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, ఎమ్మెల్సీ కవిత తన భర్త అనిల్తో కలిసి హరీశ్రావు నివాసానికి వెళ్లారు. వారు ముందుగా సత్యనారాయణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం హరీశ్రావు కుటుంబ సభ్యులను ఓదార్చారు. కుటుంబ బాధలో భాగస్వామ్యం అవుతూ, ధైర్యంగా ఉండాలని కవిత అభ్యర్థించినట్లు సమాచారం. ఈ సందర్శన పూర్తిగా వ్యక్తిగతంగా జరిగినప్పటికీ, రాజకీయ వర్గాల్లో ఇది పెద్ద చర్చకు దారితీసింది.
Baahubali – The Epic : బాహుబలి ప్రీమియర్ టికెట్ల పేరుతో మోసాలు..తస్మాత్ జాగ్రత్త
గత కొంతకాలంగా హరీశ్రావు, కవిత మధ్య రాజకీయ విభేదాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ముఖ్యంగా కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అక్రమాల విషయంలో కవిత హరీశ్రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఇరువురి మధ్య మాటల యుద్ధం చెలరేగి, బీఆర్ఎస్ అంతర్గతంగా కూడా కలకలం రేపింది. ఈ నేపథ్యంలో కవిత తాజా పరామర్శ రాజకీయ వర్గాల్లో మళ్లీ కొత్త ఊహాగానాలకు తావిచ్చింది. పార్టీ లోపల ఉన్న విభేదాలు చల్లబడుతున్నాయా? లేక ఇది కేవలం మానవతా దృక్పథంలోనూ జరిగిన చర్యనా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
పరిశీలకుల అభిప్రాయం ప్రకారం, కవిత పర్యటన వ్యక్తిగతమైనదే అయినప్పటికీ, బీఆర్ఎస్లోని అంతర్గత వాతావరణం మారుతోందనే సంకేతంగా దీనిని చూడవచ్చని అంటున్నారు. ఎన్నికల తర్వాత పార్టీని బలోపేతం చేయడానికి కవిత, హరీశ్రావు వంటి ప్రముఖ నేతల మధ్య మళ్లీ సమన్వయం అవసరమని భావిస్తున్నారు. హరీశ్రావు కూడా కవిత పట్ల సానుకూల ధోరణి ప్రదర్శించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామం బీఆర్ఎస్లో కొత్త ఐక్యతకు దారితీయవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
