Sabitha Indra Reddy: బీఆర్‌ఎస్‌లోనే సబితా, క్లారిటీ వచ్చేసింది

తనకు, తన తల్లి సబితా ఇంద్రారెడ్డికి బీఆర్‌ఎస్ ను వీడే ఆలోచన లేదని బీఆర్‌ఎస్ నేత పటోళ్ల కార్తీక్ రెడ్డి అన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో కార్తీక్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఆ రోజు ప్రత్యేక పరిస్థితుల్లో కాంగ్రెస్‌ పార్టీని వీడానని, అయితే రాజకీయ ప్రయోజనాల కోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎప్పుడూ పార్టీలు మారడం లేదన్నారు.

Sabitha Indra Reddy: తెలంగాణలో బీఆర్ఎస్ రాజకీయ ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది. ఒకప్పుడు కారు పార్టీకి ఉన్న ప్రజాధారణ ఇప్పుడు లేదు. అలాగే పార్టీ తన క్యాడర్ ని కూడా కోల్పోతుంది. గత ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్, తమ పార్టీపై గెలిచిన ఎమ్మెల్యేలను చేజార్చుకుని మరింత బలహీన పడుతుంది. ఇటీవల కాలంలో కారును వీడిన పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. తాజాగా ఆరుగురు ఎమ్మెల్సీలు సైతం కారు పార్టీకి గుడ్ బై చెప్పారు. అయితే మాజీ మంత్రి, సబితా ఇంద్రారెడ్డి కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తుంది. అయితే తాజాగా సబితా కుమారుడు కార్తీక్ రెడ్డి పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చారు.

తనకు, తన తల్లి సబితా ఇంద్రారెడ్డికి బీఆర్‌ఎస్ ను వీడే ఆలోచన లేదని బీఆర్‌ఎస్ నేత పటోళ్ల కార్తీక్ రెడ్డి అన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో కార్తీక్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఆ రోజు ప్రత్యేక పరిస్థితుల్లో కాంగ్రెస్‌ పార్టీని వీడానని, అయితే రాజకీయ ప్రయోజనాల కోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎప్పుడూ పార్టీలు మారడం లేదన్నారు. నేను పార్టీ మారను, మా అమ్మ పార్టీ మారదు. మేము బీఆర్ఎస్లోనే కొనసాగుతామని కార్తీక్ రెడ్డి చెప్పారు. అలాగే తన రాజకీయ జీవితంపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని కార్తీక్ రెడ్డి హెచ్చరించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు కార్తీక్ రెడ్డి. తెలంగాణ సంపదను అమ్ముకునేందుకు కాంగ్రెస్, బీజేపీలు రెండూ జతకట్టాయని కార్తీక్ రెడ్డి అన్నారు. తెలంగాణకు చెందిన బొగ్గును కేంద్రం వేలం వేయడం, విద్యుత్తుపై న్యాయ కమిషన్‌కు బిజెపి మద్దతు ఇవ్వడం నా వాదనకు రెండు ఉదాహరణలు అని ఆయన అన్నారు. తెలంగాణ రాజకీయ రంగంలో చోటు చేసుకున్న ఆశ్చర్యకరమైన మార్పులను ఎత్తిచూపుతూ, కాంగ్రెస్ టిక్కెట్‌పై గెలిచిన కాంగ్రెస్ నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు తన పుట్టినరోజు వేడుకలను ఖమ్మంలోని టిడిపి పార్టీ కార్యాలయంలో జరుపుకున్నారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ కలిసి పనిచేయాలని రాహుల్ గాంధీ చెప్పారని, రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలు కలిసి పనిచేస్తున్నాయనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని కార్తీక్ రెడ్డి ప్రశ్నించారు.

Also Read: Kissing Day 2024: రేపు ఇంటర్నేష‌న‌ల్ కిస్సింగ్ డే.. ముద్దు వ‌ల‌న బోలెడు బెనిఫిట్స్‌, అవేంటంటే..?