ఢిల్లీ మద్యం కుంభకోణం (Delhi Liquor Scam) లో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్ తెలుగు రాష్ట్రాలపై కొంత ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ వర్గాలలో ఎమ్మెల్సీ కవితను సీబీఐ ఇంతకుముందు ప్రశ్నించింది. సిసోడియా అరెస్ట్పై మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి స్పందిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (Kalvakuntal Kavitha)కు కూడా అదే గతి పడుతుందని జోస్యం చెప్పారు. పంజాబ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల కోసం కేసీఆర్ కూతురు కవిత (Kalvakuntal Kavitha) ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.150 కోట్లు అందించారని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని దుర్వినియోగం చేస్తూ సీఎం కేసీఆర్ భారీగా ఆస్తులు కూడబెట్టారు. తన అక్రమ సంపదను దారి మళ్లించేందుకు టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చుకుని జాతీయ రాజకీయాల ఆశయ సాధన కోసం విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నాడు’’ అని వివేక్ అన్నారు.
ఏపీ, మహారాష్ట్రల్లో బీఆర్ఎస్లో చేరిన నేతలపై కూడా బీజేపీ నేత స్పందించారు. “కాలం చెల్లిన నాయకులు మాత్రమే BRS లో చేరుతున్నారు. వారితో ఎటువంటి విలువ లేదు. ఇలాంటి నాయకులతో బీఆర్ఎస్ కొన్ని ఓట్లు తెచ్చుకోలేక, ఎన్నికల్లో గెలవలేడు’’ అని వివేక్ అన్నారు. అయితే వివేక్ మాటలు నిజమేనని పలువురు రాజకీయ నాయకులు కూడా భావిస్తున్నారు. సిసోడియా అరెస్టు తర్వాత, అందరి దృష్టి ఇప్పుడు కవిత (Kalvakuntal Kavitha)పై ఉంది. BRS క్యాంపులో భయాందోళనలు కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. అంతర్గత వర్గాల ప్రకారం.. ఇప్పటికే సీఎం కేసీఆర్ పలు అధికారులు, బీఆర్ఎస్ నాయకులతో సమావేశం కూడా అయినట్టు తెలుస్తోంది.
Also Read: Kangana Ranaut: హీరోల రూమ్స్ కు వెళ్లేందుకు ‘నో’ చెప్పాను : కంగనా