బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభకు తెలంగాణకు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను రాష్ట్రానికి చెందిన ఇరత రంగాల ప్రముఖులు కలుస్తున్నారు. మాజీ క్రికెటర్ మిథాలీ రాజ్ నడ్డాతో భేటీ అయ్యారు. ఈ రాత్రికి యువ హీరో నితిన్ కూడా భేటీ కానున్నారు. ఇక తాజాగా నడ్డాతో టీవీ9 యజమాని, మైహోం గ్రూపు అధినేత జూపల్లి రామేశ్వర్ రావు ఈరోజు సాయంత్రం 6:50 నిమిషాలకు శంషాబాద్ నోవాటెల్ హోటల్ లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ కానున్నారు.
హన్మకొండలో సభ ముగిసిన తర్వాత హెలికాప్టర్ ద్వారా ఆయన శంషాబాద్ కు రానున్నారు. ఈ సందర్భంగా నోవాటెల్ లో కాసేపు విశ్రాంతి తీసుకోనున్నారు. ఈ సమయంలో జేపీ నడ్డాతో జూపల్లి రామేశ్వరరావు భేటీ కానున్నారు.