SI Attacks Woman: తన భార్యకు బస్సులో సీటు ఇవ్వలేదని మహిళను కొట్టిన ఎస్ఐ.. విచారణకు ఆదేశించిన ఎస్పీ

మహిళపై దాడి చేసిన ఆరోపణల (SI Attacks Woman)పై జగిత్యాల రూరల్ ఎస్‌ఐ అనిల్‌కుమార్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు.

Published By: HashtagU Telugu Desk
SI Attacks Woman

Resizeimagesize (1280 X 720) (1) 11zon

మహిళపై దాడి చేసిన ఆరోపణల (SI Attacks Woman)పై జగిత్యాల రూరల్ ఎస్‌ఐ అనిల్‌కుమార్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనపై ఎస్‌ఐని జగిత్యాల(Jagtial) జిల్లా కేంద్రానికి ఎస్ఐని అటాచ్‌ చేస్తూ ఎస్పీ భాస్కర్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పాటు ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. టీఎస్‌ఆర్‌టీసీ బస్సులో సీటు పంచుకునే విషయంలో ఎస్‌ఐ భార్య, మరో మహిళ వాగ్వాదానికి దిగారు. మంగళవారం జగిత్యాలకు వెళ్లేందుకు సిద్దిపేట నుంచి తల్లితో పాటు మరో మహిళ బస్సు ఎక్కగా, ఎస్‌ఐ భార్య కరీంనగర్ బస్టాండ్ నుంచి బస్సు ఎక్కింది. సీటు పంచుకునే విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.

Also Read: Delhi : సీబీఐ అధికారుల‌మంటూ న‌గ‌ల వ్యాపారికి టోక‌రా వేసిన కేటుగాళ్లు

Also Read: Drugs : కోల్‌కతాలో భారీగా ప‌ట్టుబ‌డిన హెరాయిన్‌.. ఐదుగురు అరెస్ట్‌

బస్సు జగిత్యాల చేరుకోగానే అనిల్ కుమార్ బస్సు ఎక్కి మహిళతో వాగ్వాదానికి దిగాడు. ఆమె తన మొబైల్ ఫోన్‌తో ఎపిసోడ్‌ను రికార్డ్ చేస్తుండగా, ఎస్‌ఐ ఆమె వద్ద నుండి ఫోన్ లాక్కొని చెంపదెబ్బ కొట్టాడు. దీంతో బాధితురాలు జగిత్యాల టౌన్-1 పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్‌ఐ, ఆయన భార్య కూడా తనను బస్సులోంచి బయటకు ఈడ్చుకెళ్లారంటూ, దుర్భాషలాడారని ఆరోపించింది. ఈ ఘటనపై హైదరాబాద్ ఎంపీ, ఎయిమ్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ జగిత్యాల ఎస్పీతో మాట్లాడారు.

  Last Updated: 11 May 2023, 09:18 AM IST