Site icon HashtagU Telugu

Muchintala: ముచ్చింత‌ల్ ఆశ్ర‌మంకి రానీ కేసీఆర్‌..కార‌ణం ఇదేనా..?

CM CHinna jeeyar swamy

CM CHinna jeeyar swamy

చినజీయ‌ర్ స్వామితో ఈ మ‌ధ్య కాలంలో తెలంగాణ సీఎం కేసీఆర్ అంటిముట్ట‌న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ముచ్చింతల్‌ ఆశ్రమంలో జరిగే శాంతి కల్యాణ మహోత్సవానికి కేసీఆర్ హాజరవుతారని అందరూ ఊహించారు. అయితే ఆయన హాజరయ్యేందుకు మాత్రమే ఐదు రోజులు వాయిదా వేశారని జీయ‌ర్ ఆశ్ర‌మం వ‌ర్గాలు తెలిపాయి. అందుకే శనివారం సాయంత్రం 5 గంటలకు కల్యాణం ప్రారంభం కానున్న తరుణంలో అందరూ ముఖ్యమంత్రి కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ముఖ్యమంత్రి ఈ కార్య‌క్ర‌మానికి రాలేదు.

వాస్తవానికి శుక్రవారం కూడా ములుగు జిల్లా మేడారంలో జరిగే సమ్మక్క సారలమ్మ జాత‌రకు కేసీఆర్ గైర్హాజరు కావడంతో జాతర చివరి రోజైన శనివారం మేడారం వచ్చే అవకాశం ఉందన్న టాక్ వినిపించినా అక్క‌డికి కూడా వెళ్ల‌లేదు. ఫిబ్రవరి 5న ముచ్చింతల్‌లో 216 అడుగుల రామానుజాచార్యుల విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకను ముఖ్యమంత్రి బహిష్కరించారు. ఎందుకంటే సమానత్వ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని నరేంద్ర మోడీతో తనకు బలమైన విభేదాలు ఉన్నాయి. మోదీ ఆవిష్కరించిన శిలాఫలకం నుంచి కేసీఆర్ పేరును తొలగించడమే ఇందుకు కారణం. ఇది ముఖ్యమంత్రికి ఆగ్రహం తెప్పించినట్లు తెలుస్తోంది.

పీఎంవో సూచనల మేరకు మాత్రమే శిలాఫలకంపై పేర్లు పెట్టామని జీయర్ స్వామి స్పష్టం చేసినప్పటికీ, ముఖ్యమంత్రి అసంతృప్తితో కార్యక్రమాన్ని దాటవేశారు. ఫిబ్రవరి 11న భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను విమానాశ్రయంలో స్వాగ‌తం ప‌లికిన‌ప్ప‌టికీ ఆయనతో కలిసి ఆశ్రమానికి కూడా రాలేదు. ఇంకా ఆసక్తికరమైన విషయమేమిటంటే, కేసీఆర్ ప్రమోట్ చేస్తున్న నమస్తే తెలంగాణ తెలుగు దినపత్రిక, తెలంగాణ టుడే ఆంగ్ల దినపత్రికలు మోదీ పర్యటన తర్వాత ఆశ్రమంలో 10 రోజుల పాటు జరిగిన కార్యక్రమాలకు ఎలాంటి కవరేజీ ఇవ్వలేదు.