Ponnam prabhakar : ఈరోజు నుండి తెలంగాణలో సమగ్ర కులగణన సర్వే ప్రారంభమైంది. ఈ క్రమంలోనే గాంధీ భవన్లో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించారు, ఈ సమావేశంలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కులగణనకు బీజేపీ అనుకూలమా కాదా ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. దేశవ్యాప్తంగా సర్వే చేసేందుకు కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తెస్తావా లేదా అని నిలదీశారు. తెలంగాణలో సర్వేపై లక్ష్మణ్ అభిప్రాయం చెప్పాలని ప్రశ్నించారు. ఎన్నికల కోసం కులగణన జరుపుతున్నామని అంటున్నారని అన్నారు. సర్వేను అడ్డుకోవాలని చూస్తే లక్ష్మణ్ ద్రోహిగా మిగిలిపోతారని మండిపడ్డారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలు చేయాలా వద్దా అని నిలదీశారు. బీజేపీ ఎన్నికల్లో పూర్తిగా మతం రంగును పూసిందని ఆరోపించారు. లక్ష్మణ్ మీద గౌరవం ఉండేదని, కానీ ఇప్పుడు ఆ గౌరవాన్ని పోగొట్టుకున్నారని అన్నారు. బలహీన వర్గాలను అవమానించే విధంగా లక్ష్మణ్ మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు వ్యతిరేకమన్నారు.
బలహీన వర్గాలకు చెందిన మోడీ, వారి అనుచరుల కోసం పదేళ్లలో ఏమైనా చేశారా చెప్పాలి. తెలంగాణలో బీజేపీ బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని బీసీ అధ్యక్షుడిని తీసేశారు. సివిల్ సొసైటీలో అందరి అబిప్రాయం తీసుకొని కులగణన చేస్తున్నాం. కులగణనకు అడ్డం పడటానికి బీజేపీ చాలా ప్రయత్నాలు చేస్తుంది. బీజేపీ నేతల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. రాజస్థాన్లో రిజర్వేషన్ అమలు చేస్తుంటే హేమంత్ సొరేన్ను అరెస్ట్ చేశారు. వీపీ సింగ్ రిజర్వేషన్లు తెస్తే కమండలం పేరు మీద పదవి ఊడబీకారు.ప్రభుత్వం ఏ డాక్యుమెంట్ అడగట్లేదు. సమాచారాన్ని ప్రభుత్వం గోప్యంగా ఉంచుతుంది. బీఆర్ఎస్ సర్వే చేపట్టలేక పోయింది. మేము చేస్తున్నాం సహకరించండి. మూసీ పరివాహక ప్రాంత ప్రజల జీవన విధానం మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రక్షాళన చేస్తున్నారు. మీరు చేయలేని ప్రక్షాళన మేము చేస్తున్నాం సహకరించండి. వీలయితే సపోర్ట్ చేయాలి అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
కేటీఆర్ని పామ్ హౌస్ కేసులో ఎందుకు అరెస్ట్ చేయట్లేదని బండి సంజయ్ అంటున్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని మేము అరెస్ట్ చేయం. కేటీఆర్ , కేసీఆర్, హరీష్ రావులను అరెస్ట్ చేస్తామని మేము అనలేదు. పదేళ్లు అధికారంలో ఉండి ఢిల్లీలో దోస్తీ గాలిలో కుస్తీ పట్టింది మీరు కాదా బండి సంజయ్. రాష్ట్ర ప్రయోజనాలకోసం రాబోయే పార్లమెంట్ సెషన్లో డిల్లీకి వెళ్లి కోట్లాడతాం. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములుగా ఉండక పోతే మీరు చరిత్ర హీనులుగా మిగిలిపోతారు అని మంత్రి పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు. మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ అన్నట్లు కులగొట్టిన ప్రాంతాలకు వస్తాం. పదేళ్లు అధికారంలో ఉన్న వారు,వాళ్ల గ్యారంటీలు ఏమైనవి ముందుగా చెప్పాలి. కిషన్ రెడ్డి ఏవిధంగా హైదరాబాద్కు ఉపయోగ పడుతున్నారో టవర్ సర్కిల్ దగ్గర చర్చకు సిద్ధమా అంటే సప్పుడు చేయలేదు. జైలు కట్టినం కేసీఆర్ కుటుంబం అంతా జైలుకే అని బండి సంజయ్ అన్నారు. ఇకపోతే..రాష్ట్రంలో 80 వేల మంది ఎన్యుమరేటర్లు, 10 వేల మంది అబ్జర్వర్లతో సమగ్ర కులగణన ప్రారంభమైంది. నవంబర్ 30వ తేదీ లోపు కులగణన పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఒక్కో ఎన్యుమరేటర్కు 150 నుంచి 175 ఇళ్ల బాధ్యతను అప్పగించారు. మొత్తం 56 అంశాలపై 75 ప్రశ్నలు రూపొందించారు.
Read Also: Holidays : 2025 సెలవుల జాబితా విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం