Inter Exams : గూగుల్ మ్యాప్‌ని న‌మ్మి దారి త‌ప్పిన ఇంట‌ర్ విద్యార్థి.. 27 నిమిషాలు ఆల‌స్యంగా..!

ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రానికి వెళ్లేందుకు ఓ విద్యార్థి గూగుల్ మ్యాప్‌పై ఆధార‌ప‌డ్డారు. అయితే ఆ విద్యార్థి చివ‌రికి ఎగ్జామ్

  • Written By:
  • Updated On - March 16, 2023 / 06:37 AM IST

ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రానికి వెళ్లేందుకు ఓ విద్యార్థి గూగుల్ మ్యాప్‌పై ఆధార‌ప‌డ్డారు. అయితే ఆ విద్యార్థి చివ‌రికి ఎగ్జామ్ సెంట‌ర్‌కి వెళ్ల‌లేక‌పోయాడు. ఖమ్మం రూరల్ మండలం కొండాపురంకు చెందిన వినయ్ అనే విద్యార్థి పరీక్షకు ముందు తన పరీక్షా కేంద్రం ఎక్కడ ఉందో తెలుసుకోలేదు. అయితే ఆ విద్యార్థి మాత్రం తన పరీక్షా కేంద్రానికి చేరుకోవడానికి గూగుల్ మ్యాప్స్ యాప్‌ను ఉపయోగించాలని నిర్ణయించుకున్నాడు. విద్యార్థి గూగుల్ మ్యాప్ పెట్టుకుని ప‌రీక్షా కేంద్రానికి వెళ్ల‌గా.. అస‌లు ప‌రీక్షా కేంద్రానికి మాత్రం చేరుకోలేక‌పోయాడు,. ఎన్‌ఎస్‌పి క్యాంపు ప్రాంతంలోని అసలు కేంద్రానికి చేరుకోకుండా, మరో ప‌రీక్షా కేంద్రం వైపు గూగుల్ మ్యాప్ చూపించింది. చివ‌ర‌కు అతను అసలు సెంటర్‌ను కనుగొని అక్కడికి చేరుకునే సమయానికి 27 నిమిషాలు ఆలస్యంగా వ‌చ్చాడు. ఒక నిమిషం ఆలస్యంగా నో ఎంట్రీ నిబంధన అమలులో ఉండటంతో పరీక్ష రాయలేకపోయాడు.

ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులను నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతించరు. దీనిపై అధికారులు పదేపదే విద్యార్థులకు తెలియజేసారు, వారి కేంద్రాలను ముందుగానే ధృవీకరించాలని, భౌతికంగా తనిఖీ చేయాలని కోరారు. నిబంధనల ప్రకారం, విద్యార్థులు పరీక్ష ప్రారంభానికి ఒక గంట ముందుగా అంటే ఉదయం 8 గంటలకు పరీక్ష హాల్‌కు చేరుకోవాలి. ఉదయం 8.45 నుండి 9 గంటల మధ్య OMR షీట్‌లో తమ బయోడేటా నింపాలి. ఉదయం 9 గంటలకు ప్రశ్నపత్రం అందించబడుతుంది, దీని తరువాత విద్యార్థులను పరీక్ష హాలులోకి అనుమతించరు. కాగా, ఖమ్మంలో బుధవారం ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలకు 95.37 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. 18,586 మంది విద్యార్థుల్లో 17,726 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని, జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని అదనపు కలెక్టర్ ఎన్.మధుసూధన్ తెలిపారు. కొత్తగూడెం జిల్లాలో 10,761 మందికి గాను 9,934 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. జిల్లాలోని లక్ష్మీదేవిపల్లి మండలం నలంద కళాశాల పరీక్షా కేంద్రానికి వచ్చిన ఓ విద్యార్థికి మూర్ఛ వచ్చింది.