తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది. రేపు (ఏప్రిల్ 12, 2026) ఫలితాలు విడుదల కానున్నట్లు బోర్డు అధికారికంగా ప్రకటించింది. తెలంగాణ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను రేపు (ఏప్రిల్ 12) మధ్యాహ్నం 12:30 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ఈ ప్రక్రియను ఆయన చేపట్టనున్నారు. ఈ ఏడాది దాదాపు 9.9 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 4.89 లక్షలు కాగా, సెకండ్ ఇయర్ విద్యార్థులు 5.07 లక్షల మంది ఉన్నారు. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు జరిగిన ఈ పరీక్షల ఫలితాల కోసం విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
సాంకేతిక జాగ్రత్తలు మరియు రీ-వాల్యూయేషన్
గతంలో జరిగిన సాంకేతిక లోపాలను దృష్టిలో ఉంచుకుని, ఈసారి ఇంటర్ బోర్డు అత్యంత పకడ్బందీగా వ్యవహరించింది. మార్కుల లెక్కింపులో పొరపాట్లు జరగకుండా రెండుసార్లు మూల్యాంకనం (Double Evaluation) నిర్వహించారు. ముఖ్యంగా కేవలం ఒకటి లేదా రెండు మార్కుల తేడాతో ఫెయిల్ అయిన విద్యార్థుల పేపర్లను ప్రత్యేకంగా రీ-వాల్యూయేషన్ చేసి, ఫలితాల్లో ఎలాంటి లోపాలు లేకుండా జాగ్రత్త పడ్డారు. ఫలితాల విడుదల సమయంలో వెబ్సైట్ సర్వర్లు మొరాయించకుండా కూడా ముందస్తు ఏర్పాట్లు చేసినట్లు బోర్డు అధికారులు తెలిపారు.
వాట్సాప్లో ఫలితాలు
వెబ్సైట్ ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఈసారి విద్యార్థులు తమ వాట్సాప్ (WhatsApp) ద్వారా కూడా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. ఇందుకోసం బోర్డు అధికారికంగా 8096958096 నంబర్ను కేటాయించింది. ఈ సదుపాయాన్ని విద్యార్థులు ఎలా ఉపయోగించుకోవాలో కింద చూడవచ్చు:
