Indiramma Housing Scheme : తెలంగాణ రాష్ట్రంలో దీపావళి (Diwali) సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) అర్హులైన పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లను (Indiramma Houses) కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) మాట్లాడారు.. దీపావళి పర్వదినం రోజున ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించి అతి పేదవారికి ఈ ఇండ్లు కేటాయిస్తారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికకు ప్రత్యేక యాప్ను అభివృద్ధి చేసి, తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులో ఉంచారు.
ఎవరెవరికి అర్హత?
ఈ పథకం కేవలం బీపీఎల్ (BPL) కార్డు ఉన్న కుటుంబాలకు మాత్రమే వర్తిస్తుంది, అంటే తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే ఇళ్లు కేటాయిస్తారు. ఇల్లు సొంతంగా ఉండి, కిరాయి ఇంట్లో లేదా కచ్చా ఇండ్లలో నివసించే వారే అర్హులు. గడచిన కేసీఆర్ (KCR) ప్రభుత్వంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల మాదిరిగా కాకుండా, లబ్ధిదారుల సొంత స్థలంలో నాలుగు దశల్లో ఈ ఇండ్ల నిర్మాణం చేపడతారు.
ఇంటి నిర్మాణానికి నిధులు ఇంటి నిర్మాణానికి మొత్తం రూ. 5 లక్షలు మంజూరు చేస్తారు. పునాదులు పూర్తి అయిన తర్వాత ఒక లక్ష, రూఫ్ లెవల్కు చేరుకున్న తర్వాత మరో లక్ష, స్లాబ్ వేయించిన తర్వాత రూ. 2 లక్షలు, మొత్తం పూర్తయిన తర్వాత మిగిలిన లక్ష బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది.
అవసరమైన ధృవపత్రాలు
ఇందిరమ్మ ఇండ్ల పథకానికి ప్రధానంగా మహిళల పేరునే ఇల్లు మంజూరు చేయనున్నారు. ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ బుక్, పాస్పోర్ట్ సైజు ఫోటోలు, తెల్ల రేషన్ కార్డు వంటి ధృవపత్రాలను సమర్పించాలి.
ఈ పథకం దశలవారీగా అమలవుతుందని, ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులు గ్రామసభలలో పారదర్శకంగా చేస్తామని ప్రభుత్వం తెలిపింది.
Read Also : Raj Pakala : పొంగులేటి చెప్పినట్లే..కేటీఆర్ బావమరిదితో స్టార్ట్ చేయబోతున్నారా…?