ఇండిగో ఫ్లైట్ లో ఓ తెలుగు ప్రయాణికురాలికి జరిగిన అవమానంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు. ఈనెల 16 వ తేదీన విజయవాడ నుంచి హైదరాబాద్ కు వస్తున్న మహిళకు ఇంగ్లీష్, హిందీ రాదన్న కారణంలో ఫ్లైట్ లో ఆమె సీటు మార్చడాన్ని తప్పు పడుతూ ట్విట్టర్ లో ఓ ప్రెఫెసర్ చేసిన ట్వీట్ ను మంత్రి కేటీఆర్ ఖండించారు. ఇండిగో సిబ్బందిని ట్యాగ్ చేస్తూ…హిందీ, ఇంగ్లీష్ భాషలు మాట్లాడటం రానంత మాత్రాన వాళ్లను అవమానపర్చడం సరికాదని ట్వీట్ చేశారు. ప్రాంతీయ భాషను మాట్లాడే సిబ్బందిని నియమించుకోవాలంటూ ఇండిగోకు సూచించారు. ఇప్పుడు ఈ వార్త వైరల్ అవుతోంది. ఇండిగో ఫ్లైట్ సర్వీసు సంస్థపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి.
Indigo 6E 7297. Vijayawada (AP) to Hyderabad (Telangana), Sept 16-2022. The woman in green originally sitting in 2A (XL seat, exit row) was forced to seat 3C because she understood only Telugu, not English/Hindi. The attendant said it's a security issue. #discrimination @IndiGo6E pic.twitter.com/bHa8hQj5vz
— Devasmita Chakraverty, PhD, MPH (@DevasmitaTweets) September 17, 2022