Viral News : ఇండిగో ఫ్లైట్‌లో తెలుగు ప్రయాణికురాలికి అవమానం ..స్పందించిన మంత్రి కేటీఆర్..!!

ఇండిగో ఫ్లైట్ లో ఓ తెలుగు ప్రయాణికురాలికి జరిగిన అవమానంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు.

  • Written By:
  • Publish Date - September 19, 2022 / 11:51 AM IST

ఇండిగో ఫ్లైట్ లో ఓ తెలుగు ప్రయాణికురాలికి జరిగిన అవమానంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు. ఈనెల 16 వ తేదీన విజయవాడ నుంచి హైదరాబాద్ కు వస్తున్న మహిళకు ఇంగ్లీష్, హిందీ రాదన్న కారణంలో ఫ్లైట్ లో ఆమె సీటు మార్చడాన్ని తప్పు పడుతూ ట్విట్టర్ లో ఓ ప్రెఫెసర్ చేసిన ట్వీట్ ను మంత్రి కేటీఆర్ ఖండించారు. ఇండిగో సిబ్బందిని ట్యాగ్ చేస్తూ…హిందీ, ఇంగ్లీష్ భాషలు మాట్లాడటం రానంత మాత్రాన వాళ్లను అవమానపర్చడం సరికాదని ట్వీట్ చేశారు. ప్రాంతీయ భాషను మాట్లాడే సిబ్బందిని నియమించుకోవాలంటూ ఇండిగోకు సూచించారు. ఇప్పుడు ఈ వార్త వైరల్ అవుతోంది. ఇండిగో ఫ్లైట్ సర్వీసు సంస్థపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి.